Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:49 AM

ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం – సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం – సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం – సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్
March 09, 2026 02:13 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

రామన్నపేట: ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ విమర్శించారు. ఆదివారం రామన్నపేట పట్టణంలో నిర్వహించిన ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రజా ఉద్యమాలకు ప్రజావిరాళం కూడా సేకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకనాటి పాత తాలూకా, నియోజకవర్గ కేంద్రంగా పేరొందిన రామన్నపేట నేడు అనేక సమస్యలతో నిండిపోయిందన్నారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.20 కోట్ల నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టణంలో పారిశుధ్య లోపం, తాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు వినోదం కోసం పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు.

అధిక వర్షాలు కురిసిన సమయంలో వరద నీరు ఇండ్లలోకి చేరుతున్న పరిస్థితి ఉందని, దీనికి శాశ్వత పరిష్కారంగా డ్రైనేజీ వ్యవస్థను పక్కాగా ఏర్పాటు చేయాలని అన్నారు. అంతర్గత రోడ్లను పూర్తిస్థాయిలో నిర్మించడంతో పాటు కోతులు, కుక్కలు, పందుల బెడద నుంచి ప్రజలను రక్షించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని అన్నారు.

సిపిఎం చేపట్టే ప్రజా పోరాటాలకు ప్రజలు విరాళాలు అందించి సమస్యల పరిష్కారానికి జరిగే ఉద్యమాలకు బాసటగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

గ్యాస్ ధరల పెంపుపై నిరసన

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలతో కలిసి గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. యుద్ధాలను కారణంగా చూపిస్తూ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై భారీ భారాలు మోపుతున్నారని ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు కందుల హనుమతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, బావండ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, నాయకులు పల్లె సత్యం, బావండ్లపల్లి సత్యం, బాబూచారి, వేముల మల్లేశం, బండ శ్రీశైలం, మునికుంట్ల రాణి, కుందూరు వెంకటేశం, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News