PRINT TIME: July 11, 2026 04:59 PM
ప్రభుత్వ వైద్యం పేదలకు వరం: 7వ వార్డు మెంబర్ చినపాక రమేష్
ప్రభుత్వ వైద్యం పేదలకు వరం: 7వ వార్డు మెంబర్ చినపాక రమేష్
April 08, 2026 04:36 PM
163 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ మరియు టీబీ సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సేవలు పేదలకు వరంగా మారాయని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటిస్తూ ఇలాంటి శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో HEO గోపాల్, డాక్టర్ వెంకట్, ANM డి. కవిత, ఆశా వర్కర్లు కృష్ణవేణి, ఉప్పలమ్మ, అంగన్వాడీ టీచర్లు నాగటి మంగమ్మ, చిప్పలపల్లి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై వైద్య సేవలను పొందారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి