Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:26 PM

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం
May 17, 2026 02:42 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు యందు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా కళాశాలలో విద్యనభ్యసించి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్న పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కె. వాణి, కనకరాజు, సి.హెచ్. వినోద్ బాబు, జె. సురేష్‌లను కళాశాల యాజమాన్యం శాలువాలతో సన్మానించింది. అలాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పూర్వ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఎకనామిక్స్ చదువుతున్న వై. పవన్, ఎం.ఎస్‌సీ కెమిస్ట్రీ అభ్యసిస్తున్న జె. కావేరి, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.కాం చదువుతున్న ఎస్. రాజు, ఎం.ఏ. తెలుగు అభ్యసించిన అన్నమ్మ, భోనగిరిలోని మదర్ థెరిసా కళాశాలలో బి.ఎడ్ శిక్షణ పొందుతున్న బి. బాలమరియమ్మలను ఈ సందర్భంగా సత్కరించారు.కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె. రాజారాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎన్. మల్లేశం, జె. భారతి, ఎన్.సి. సౌజన్య, కే. వెంకటేశ్వర్లు, బి. రవీందర్, సిహెచ్. జానయ్య, వి. నందకుమార్, ఎస్. నాగమణి, ఎస్. జ్యోతి, ఎన్. ముత్యాలు, మొరిగాడి బాలరాజు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News