Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:59 AM

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం
17-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు యందు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా కళాశాలలో విద్యనభ్యసించి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్న పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కె. వాణి, కనకరాజు, సి.హెచ్. వినోద్ బాబు, జె. సురేష్‌లను కళాశాల యాజమాన్యం శాలువాలతో సన్మానించింది. అలాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పూర్వ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఎకనామిక్స్ చదువుతున్న వై. పవన్, ఎం.ఎస్‌సీ కెమిస్ట్రీ అభ్యసిస్తున్న జె. కావేరి, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.కాం చదువుతున్న ఎస్. రాజు, ఎం.ఏ. తెలుగు అభ్యసించిన అన్నమ్మ, భోనగిరిలోని మదర్ థెరిసా కళాశాలలో బి.ఎడ్ శిక్షణ పొందుతున్న బి. బాలమరియమ్మలను ఈ సందర్భంగా సత్కరించారు.కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె. రాజారాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎన్. మల్లేశం, జె. భారతి, ఎన్.సి. సౌజన్య, కే. వెంకటేశ్వర్లు, బి. రవీందర్, సిహెచ్. జానయ్య, వి. నందకుమార్, ఎస్. నాగమణి, ఎస్. జ్యోతి, ఎన్. ముత్యాలు, మొరిగాడి బాలరాజు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం

Article Image

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు యందు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా కళాశాలలో విద్యనభ్యసించి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్న పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కె. వాణి, కనకరాజు, సి.హెచ్. వినోద్ బాబు, జె. సురేష్‌లను కళాశాల యాజమాన్యం శాలువాలతో సన్మానించింది. అలాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పూర్వ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఎకనామిక్స్ చదువుతున్న వై. పవన్, ఎం.ఎస్‌సీ కెమిస్ట్రీ అభ్యసిస్తున్న జె. కావేరి, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.కాం చదువుతున్న ఎస్. రాజు, ఎం.ఏ. తెలుగు అభ్యసించిన అన్నమ్మ, భోనగిరిలోని మదర్ థెరిసా కళాశాలలో బి.ఎడ్ శిక్షణ పొందుతున్న బి. బాలమరియమ్మలను ఈ సందర్భంగా సత్కరించారు.కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె. రాజారాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎన్. మల్లేశం, జె. భారతి, ఎన్.సి. సౌజన్య, కే. వెంకటేశ్వర్లు, బి. రవీందర్, సిహెచ్. జానయ్య, వి. నందకుమార్, ఎస్. నాగమణి, ఎస్. జ్యోతి, ఎన్. ముత్యాలు, మొరిగాడి బాలరాజు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News