ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం
Editor Desk
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు యందు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా కళాశాలలో విద్యనభ్యసించి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్న పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కె. వాణి, కనకరాజు, సి.హెచ్. వినోద్ బాబు, జె. సురేష్లను కళాశాల యాజమాన్యం శాలువాలతో సన్మానించింది. అలాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పూర్వ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా అభినందించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఎకనామిక్స్ చదువుతున్న వై. పవన్, ఎం.ఎస్సీ కెమిస్ట్రీ అభ్యసిస్తున్న జె. కావేరి, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.కాం చదువుతున్న ఎస్. రాజు, ఎం.ఏ. తెలుగు అభ్యసించిన అన్నమ్మ, భోనగిరిలోని మదర్ థెరిసా కళాశాలలో బి.ఎడ్ శిక్షణ పొందుతున్న బి. బాలమరియమ్మలను ఈ సందర్భంగా సత్కరించారు.కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె. రాజారాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎన్. మల్లేశం, జె. భారతి, ఎన్.సి. సౌజన్య, కే. వెంకటేశ్వర్లు, బి. రవీందర్, సిహెచ్. జానయ్య, వి. నందకుమార్, ఎస్. నాగమణి, ఎస్. జ్యోతి, ఎన్. ముత్యాలు, మొరిగాడి బాలరాజు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి