ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవిష్యత్కు బాట” ఉపసర్పంచ్ మోటె రమేష్
ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవిష్యత్కు బాట” ఉపసర్పంచ్ మోటె రమేష్
Editor Desk
రామన్నపేట: మండల కేంద్రంలోని సంజీవయ్య నగర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో ‘ముందస్తు బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల పరిధిలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటె రమేష్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి బాలబాలికను తప్పనిసరిగా ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మనందరి బాధ్యత అని అన్నారు.
వార్డు సభ్యుడు కొమ్ము రామస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం, ఉచిత యూనిఫారం, నోటుపుస్తకాలు, రాగి జావా వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకుని ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలని పిలుపునిచ్చారు.
ప్రధానోపాధ్యాయురాలు జలజాక్షి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్య, క్రమశిక్షణతో బోధన కొనసాగుతున్నందున పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేర్పించాలని కోరారు.
కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునీత, ఉపాధ్యాయులు పుష్పావతి, నాగయ్య, అబ్దుల్ రహీం, కుమారస్వామి, సునీత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి