Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:50 PM

ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవిష్యత్‌కు బాట” ఉపసర్పంచ్ మోటె రమేష్

ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవిష్యత్‌కు బాట” ఉపసర్పంచ్ మోటె రమేష్

ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవిష్యత్‌కు బాట”  ఉపసర్పంచ్ మోటె రమేష్
07-04-2026 200 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల కేంద్రంలోని సంజీవయ్య నగర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో ‘ముందస్తు బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల పరిధిలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటె రమేష్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి బాలబాలికను తప్పనిసరిగా ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మనందరి బాధ్యత అని అన్నారు.

వార్డు సభ్యుడు కొమ్ము రామస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం, ఉచిత యూనిఫారం, నోటుపుస్తకాలు, రాగి జావా వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకుని ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలని పిలుపునిచ్చారు.

ప్రధానోపాధ్యాయురాలు జలజాక్షి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్య, క్రమశిక్షణతో బోధన కొనసాగుతున్నందున పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేర్పించాలని కోరారు.

కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునీత, ఉపాధ్యాయులు పుష్పావతి, నాగయ్య, అబ్దుల్ రహీం, కుమారస్వామి, సునీత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవిష్యత్‌కు బాట” ఉపసర్పంచ్ మోటె రమేష్

Article Image

రామన్నపేట: మండల కేంద్రంలోని సంజీవయ్య నగర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో ‘ముందస్తు బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల పరిధిలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటె రమేష్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి బాలబాలికను తప్పనిసరిగా ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మనందరి బాధ్యత అని అన్నారు.

వార్డు సభ్యుడు కొమ్ము రామస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం, ఉచిత యూనిఫారం, నోటుపుస్తకాలు, రాగి జావా వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకుని ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలని పిలుపునిచ్చారు.

ప్రధానోపాధ్యాయురాలు జలజాక్షి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్య, క్రమశిక్షణతో బోధన కొనసాగుతున్నందున పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేర్పించాలని కోరారు.

కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునీత, ఉపాధ్యాయులు పుష్పావతి, నాగయ్య, అబ్దుల్ రహీం, కుమారస్వామి, సునీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News