Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సత్తుపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల నియామక సన్నాహక సమావేశం నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 01:57 PM

ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవిష్యత్‌కు బాట” ఉపసర్పంచ్ మోటె రమేష్

ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవిష్యత్‌కు బాట” ఉపసర్పంచ్ మోటె రమేష్

ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవిష్యత్‌కు బాట”  ఉపసర్పంచ్ మోటె రమేష్
April 07, 2026 01:23 PM 164 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల కేంద్రంలోని సంజీవయ్య నగర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో ‘ముందస్తు బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల పరిధిలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటె రమేష్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి బాలబాలికను తప్పనిసరిగా ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మనందరి బాధ్యత అని అన్నారు.

వార్డు సభ్యుడు కొమ్ము రామస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం, ఉచిత యూనిఫారం, నోటుపుస్తకాలు, రాగి జావా వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకుని ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలని పిలుపునిచ్చారు.

ప్రధానోపాధ్యాయురాలు జలజాక్షి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్య, క్రమశిక్షణతో బోధన కొనసాగుతున్నందున పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేర్పించాలని కోరారు.

కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునీత, ఉపాధ్యాయులు పుష్పావతి, నాగయ్య, అబ్దుల్ రహీం, కుమారస్వామి, సునీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News