Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన:మంత్రి ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 07:26 PM

ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
April 22, 2026 05:44 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి బడిబాట సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వివరించాలని ప్రధానోపాధ్యాయులను కోరారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా బడి ఈడు పిల్లల వివరాలు సేకరించి, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చదువు మానేసిన వారి వివరాలను నమోదు చేసి, సరైన ప్రణాళికతో అడ్మిషన్లు పెంచాలని సూచించారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు కూడా సేకరించి ప్రోత్సహించాలని తెలిపారు.

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సర్పంచుల సహకారం తీసుకోవాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లో విశ్వాసం కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ఇతరులకు నమ్మకం పెరుగుతుందని అన్నారు.

తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఉపాధ్యాయులు ప్రావీణ్యం పెంపొందించుకోవాలని సూచించారు.

సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. సత్యనారాయణ, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News