ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలి.అదనపు కలెక్టర్ భాస్కర్రావు
ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలి.అదనపు కలెక్టర్ భాస్కర్రావు
Editor Desk
: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి బడిబాట సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వివరించాలని ప్రధానోపాధ్యాయులను కోరారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా బడి ఈడు పిల్లల వివరాలు సేకరించి, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చదువు మానేసిన వారి వివరాలను నమోదు చేసి, సరైన ప్రణాళికతో అడ్మిషన్లు పెంచాలని సూచించారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు కూడా సేకరించి ప్రోత్సహించాలని తెలిపారు.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సర్పంచుల సహకారం తీసుకోవాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లో విశ్వాసం కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ఇతరులకు నమ్మకం పెరుగుతుందని అన్నారు.
తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఉపాధ్యాయులు ప్రావీణ్యం పెంపొందించుకోవాలని సూచించారు.
సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. సత్యనారాయణ, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి