Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 10:48 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
April 22, 2026 05:44 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి బడిబాట సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వివరించాలని ప్రధానోపాధ్యాయులను కోరారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా బడి ఈడు పిల్లల వివరాలు సేకరించి, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చదువు మానేసిన వారి వివరాలను నమోదు చేసి, సరైన ప్రణాళికతో అడ్మిషన్లు పెంచాలని సూచించారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు కూడా సేకరించి ప్రోత్సహించాలని తెలిపారు.

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సర్పంచుల సహకారం తీసుకోవాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లో విశ్వాసం కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ఇతరులకు నమ్మకం పెరుగుతుందని అన్నారు.

తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఉపాధ్యాయులు ప్రావీణ్యం పెంపొందించుకోవాలని సూచించారు.

సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. సత్యనారాయణ, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News