ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రచారంతో అడ్మిషన్లకు ఊతం
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రచారంతో అడ్మిషన్లకు ఊతం
Editor Desk
రామన్నపేట మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల పెంపునకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సి. జగదీష్ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి, కళాశాల ప్రత్యేకతలను వివరించారు.
ఉచిత ఇంటర్ విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, స్కాలర్షిప్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నట్లు వెల్లడించారు.
అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతులు, ల్యాబ్ సదుపాయాలు, గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, బస్సు సౌకర్యం వంటి వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. EAPCET, JEE, NEET, CLAT వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో మాలే వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, నరసింహారావు, అశోక్ కుమార్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జీవి రావు, పున్నారావు, కిరణ్, ఉమా రాణి తదితరులు పాల్గొని విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి