Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:48 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రచారంతో అడ్మిషన్లకు ఊతం

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రచారంతో అడ్మిషన్లకు ఊతం

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రచారంతో అడ్మిషన్లకు ఊతం
07-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల పెంపునకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సి. జగదీష్ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి, కళాశాల ప్రత్యేకతలను వివరించారు.

ఉచిత ఇంటర్ విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, స్కాలర్షిప్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నట్లు వెల్లడించారు.

అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతులు, ల్యాబ్ సదుపాయాలు, గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, బస్సు సౌకర్యం వంటి వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. EAPCET, JEE, NEET, CLAT వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో మాలే వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, నరసింహారావు, అశోక్ కుమార్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జీవి రావు, పున్నారావు, కిరణ్, ఉమా రాణి తదితరులు పాల్గొని విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని కోరారు.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రచారంతో అడ్మిషన్లకు ఊతం

Article Image

రామన్నపేట మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల పెంపునకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సి. జగదీష్ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి, కళాశాల ప్రత్యేకతలను వివరించారు.

ఉచిత ఇంటర్ విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, స్కాలర్షిప్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నట్లు వెల్లడించారు.

అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతులు, ల్యాబ్ సదుపాయాలు, గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, బస్సు సౌకర్యం వంటి వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. EAPCET, JEE, NEET, CLAT వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో మాలే వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, నరసింహారావు, అశోక్ కుమార్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జీవి రావు, పున్నారావు, కిరణ్, ఉమా రాణి తదితరులు పాల్గొని విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News