Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:21 PM

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!
April 18, 2026 02:41 PM 256 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ పరిధిలోని 392 సర్వే నెంబర్ గల గాదిరెడ్డిపల్లి వద్ద గల ప్రభుత్వ భూమిలో రైల్వే ట్రాక్ పనుల పేరుతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.

చిట్యాల ఎమ్మార్వో విజయకుమార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ జానీ షరీఫ్ దాడులు నిర్వహించి, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు ఇటాచి యంత్రాలు, ఒక టిప్పర్ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిని దోచుకుంటూ, రైల్వే పనుల పేరిట నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం ఇటువంటి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నా పర్యవేక్షణ లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News