ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!
ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!
Komidala Mahender reddy
చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ పరిధిలోని 392 సర్వే నెంబర్ గల గాదిరెడ్డిపల్లి వద్ద గల ప్రభుత్వ భూమిలో రైల్వే ట్రాక్ పనుల పేరుతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.
చిట్యాల ఎమ్మార్వో విజయకుమార్ ఆదేశాల మేరకు ఆర్ఐ జానీ షరీఫ్ దాడులు నిర్వహించి, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు ఇటాచి యంత్రాలు, ఒక టిప్పర్ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిని దోచుకుంటూ, రైల్వే పనుల పేరిట నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం ఇటువంటి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నా పర్యవేక్షణ లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి