Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 10:06 PM

ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ప్రతిపాదనకు వ్యతిరేకం

ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ప్రతిపాదనకు వ్యతిరేకం

ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ప్రతిపాదనకు వ్యతిరేకం
March 11, 2026 03:59 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

రంగారెడ్డి, :

చైతన్యపురి డివిజన్ పరిధిలోని ప్రభాత్ నగర్ కాలనీలో ఉన్న మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్‌ను పోలీస్ స్టేషన్‌గా మార్చే ప్రతిపాదనకు కాలనీవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హాల్‌ను పోలీస్ స్టేషన్‌కు ఇవ్వవద్దని వారు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కాలనీవాసుల వినతిపై స్పందించిన ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్, పార్క్ కోసం అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఆ స్థలాన్ని ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు తెలియజేసిన నేపథ్యంలో, ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్‌ను పోలీస్ స్టేషన్ కోసం వినియోగించాలనే ప్రతిపాదనపై కాలనీవాసుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని, రెండు మూడు రోజుల్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతామని సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్లు నరసింహ గుప్త, విట్టల్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ప్రభాత్ నగర్ కాలనీ అధ్యక్షులు బాల్ రెడ్డి, గట్టు శ్రీను, రమణా రెడ్డి, రామారావు, రాజేష్, నాగేందర్, బాలరాజు, విద్యాసాగర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News