Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:15 AM

పాల ఉత్పత్తిదారుల కుటుంబాలకు అండగా ‘కళ్యాణమస్తు’ పథకం… వివాహానికి రూ.20 వేల గోల్డ్ కాయిన్ అందజేత

పాల ఉత్పత్తిదారుల కుటుంబాలకు అండగా ‘కళ్యాణమస్తు’ పథకం… వివాహానికి రూ.20 వేల గోల్డ్ కాయిన్ అందజేత

పాల ఉత్పత్తిదారుల కుటుంబాలకు అండగా ‘కళ్యాణమస్తు’ పథకం… వివాహానికి రూ.20 వేల గోల్డ్ కాయిన్ అందజేత
March 15, 2026 08:34 AM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు క్లస్టర్ పరిధిలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కే కొత్తగూడెం పాల సంఘంలో ఆనందోత్సాహాల మధ్య ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాల ఉత్పత్తిదారురాలు ఓబిల్లనేని జ్యోతి కుమారుడు సతీష్ వివాహాన్ని పురస్కరించుకుని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రవేశపెట్టిన “కళ్యాణమస్తు” పథకం ద్వారా రూ.20,000 విలువైన బంగారు నాణెాన్ని వరుడికి అందజేశారు. ఈ గోల్డ్ కాయిన్‌ను జిల్లా పాలకవర్గ సభ్యులు బొట్టు రామచంద్రరావు, తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి.ప్రసాద్, సంఘ అధ్యక్షులు మల్లెంపల్లి గంగారత్నం చేతుల మీదుగా ఘనంగా అందజేశారు. పాల ఉత్పత్తిదారుల కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు కృష్ణా మిల్క్ యూనియన్ అండగా నిలుస్తూ రైతు కుటుంబాలకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు, సూపర్వైజర్ బి.నరసింహారావు, వేతన కార్యదర్శి ఎం.గోపాలరావు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతు సంక్షేమానికి ఇలాంటి పథకాలు మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News