Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:46 PM

పదో తరగతి విద్యార్థుల చివరి రోజు – ఆనందం, జ్ఞాపకాల నడుమ ముగింపు

పదో తరగతి విద్యార్థుల చివరి రోజు – ఆనందం, జ్ఞాపకాల నడుమ ముగింపు

పదో తరగతి విద్యార్థుల చివరి రోజు – ఆనందం, జ్ఞాపకాల నడుమ ముగింపు
April 11, 2026 03:38 PM 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల చివరి వర్కింగ్ డే ఉత్సాహంగా, భావోద్వేగంగా జరిగింది. విద్యార్థులు తమ జీవితంలో కీలకమైన ఈ రోజును ఆనందంగా జరుపుకున్నారు.

గత మూడు సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తమ స్నేహాలు, గురువుల బోధనలను స్మరించుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ జీవితంలో తొలి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతూ, సోమవారం జరిగే సోషల్ పరీక్షకు ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు.

భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలిపారు. స్నేహబంధాన్ని కొనసాగించాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా సోషల్ టీచర్ స్వరూప రాణి మాట్లాడుతూ పదో తరగతి జీవితంలో తొలి మెట్టుగా భావించాలని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని సూచించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News