పదో తరగతి విద్యార్థుల చివరి రోజు – ఆనందం, జ్ఞాపకాల నడుమ ముగింపు
పదో తరగతి విద్యార్థుల చివరి రోజు – ఆనందం, జ్ఞాపకాల నడుమ ముగింపు
Editor Desk
రామన్నపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల చివరి వర్కింగ్ డే ఉత్సాహంగా, భావోద్వేగంగా జరిగింది. విద్యార్థులు తమ జీవితంలో కీలకమైన ఈ రోజును ఆనందంగా జరుపుకున్నారు.
గత మూడు సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తమ స్నేహాలు, గురువుల బోధనలను స్మరించుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ జీవితంలో తొలి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతూ, సోమవారం జరిగే సోషల్ పరీక్షకు ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు.
భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలిపారు. స్నేహబంధాన్ని కొనసాగించాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా సోషల్ టీచర్ స్వరూప రాణి మాట్లాడుతూ పదో తరగతి జీవితంలో తొలి మెట్టుగా భావించాలని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని సూచించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి