పద్మశాలి కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించాలి
పద్మశాలి కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించాలి
Editor Desk
రామన్నపేట, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యను నివారించేందుకు పద్మశాలి కాలనీలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వహించిన ఇంటింటా సిపిఎం కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు మాట్లాడుతూ… కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరారు. అలాగే జియో ట్యాగ్తో సంబంధం లేకుండా చేనేత కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని, రూ.40 కోట్ల నిధులు కేటాయించి ఆసుపత్రి పక్కన కొత్త భవనాలు నిర్మించి వైద్య సేవలను మెరుగుపరచాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16న నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా దీక్షకు మద్దతు తెలుపుతూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లెనిన్, మండల కమిటీ సభ్యులు భావడ్లపెల్లి బాలరాజు, గోరిగే సోములు, కార్మిక సంఘ నాయకులు పల్లె సత్యం, సబ్ శాఖ కార్యదర్శి గంజి అశోక్, కడారి రాములు, అప్పం సంతోష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి