Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:13 AM

పద్మశాలి కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించాలి

పద్మశాలి కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించాలి

పద్మశాలి కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించాలి
March 10, 2026 12:30 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యను నివారించేందుకు పద్మశాలి కాలనీలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వహించిన ఇంటింటా సిపిఎం కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు మాట్లాడుతూ… కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరారు. అలాగే జియో ట్యాగ్‌తో సంబంధం లేకుండా చేనేత కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని, రూ.40 కోట్ల నిధులు కేటాయించి ఆసుపత్రి పక్కన కొత్త భవనాలు నిర్మించి వైద్య సేవలను మెరుగుపరచాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16న నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా దీక్షకు మద్దతు తెలుపుతూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లెనిన్, మండల కమిటీ సభ్యులు భావడ్లపెల్లి బాలరాజు, గోరిగే సోములు, కార్మిక సంఘ నాయకులు పల్లె సత్యం, సబ్ శాఖ కార్యదర్శి గంజి అశోక్, కడారి రాములు, అప్పం సంతోష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News