ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి
Editor Desk
హైదరాబాద్/:
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి పురోగతి సాధించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల మ్యాపింగ్, బూత్ స్థాయి అధికారుల శిక్షణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై చర్చించారు.
మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బూత్ స్థాయి అధికారులు సమర్థంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం పూర్తి చేయాలని తెలిపారు.
బూత్ స్థాయి అధికారులకు శిక్షణ అందించడంతో పాటు ఏజెంట్లకు, రాజకీయ పార్టీలకు అవసరమైన శిక్షణ మెటీరియల్ అందజేయాలని సూచించారు. బూత్ స్థాయిలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.
పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి