Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక రాఘవ్ చద్దా గది: భవిష్యత్ ప్రధాని యొక్క పుస్తకాల సామ్రాజ్యం అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 10:48 PM

ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి
April 04, 2026 08:17 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్/:

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి పురోగతి సాధించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల మ్యాపింగ్, బూత్ స్థాయి అధికారుల శిక్షణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై చర్చించారు.

మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బూత్ స్థాయి అధికారులు సమర్థంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం పూర్తి చేయాలని తెలిపారు.

బూత్ స్థాయి అధికారులకు శిక్షణ అందించడంతో పాటు ఏజెంట్లకు, రాజకీయ పార్టీలకు అవసరమైన శిక్షణ మెటీరియల్ అందజేయాలని సూచించారు. బూత్ స్థాయిలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News