Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:45 PM

నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన చిరుమర్తి లింగయ్య

నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన చిరుమర్తి లింగయ్య

నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన చిరుమర్తి లింగయ్య
February 25, 2026 05:18 PM 318 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన పోనుగోటి లింగారావు కుమార్తె వివాహ వేడుక పట్టణ కేంద్రంలోని గరిక వేదశ్రీ గార్డెన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ, దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. పెద్దల ఆశీస్సులతో కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్న వధూవరులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపీటీసీలు దోమల సతీష్, ఎండి అమీర్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల రాంబాబు, ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, వార్డు సభ్యులు బైరోజు పురుషోత్తం, నల్ల సైదులు, కన్నెబోయిన వెంకటేశం, నాయకులు గట్టు భిక్షం, బైరోజు ధనుంజయ, వల్ల మల్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News