నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన చిరుమర్తి లింగయ్య
నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన చిరుమర్తి లింగయ్య
స్థానికం బృందం
రామన్నపేట: మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన పోనుగోటి లింగారావు కుమార్తె వివాహ వేడుక పట్టణ కేంద్రంలోని గరిక వేదశ్రీ గార్డెన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ, దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. పెద్దల ఆశీస్సులతో కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్న వధూవరులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపీటీసీలు దోమల సతీష్, ఎండి అమీర్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల రాంబాబు, ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, వార్డు సభ్యులు బైరోజు పురుషోత్తం, నల్ల సైదులు, కన్నెబోయిన వెంకటేశం, నాయకులు గట్టు భిక్షం, బైరోజు ధనుంజయ, వల్ల మల్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి