నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి
నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి
Editor Desk
నల్గొండ,
చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఉన్న నోష్ ల్యాబ్ ఫార్మా కంపెనీ కార్మికులకు భద్రత కల్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఆ సంస్థపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారి ఎం. మోతిలాల్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ, కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి లాభాల కోసం కంపెనీ నిర్వహణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని, కార్మికులు తీవ్రంగా గాయపడుతున్నారని అన్నారు.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ, యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రమాదాల సమయంలో మాత్రమే అధికారులు స్పందించి, తరువాత నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అందువల్ల వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, నోష్ ల్యాబ్ ఫార్మా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ఎన్. నాగయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి