Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:12 AM

నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి

నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి

నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి
April 10, 2026 06:49 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఉన్న నోష్ ల్యాబ్ ఫార్మా కంపెనీ కార్మికులకు భద్రత కల్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఆ సంస్థపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారి ఎం. మోతిలాల్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ, కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి లాభాల కోసం కంపెనీ నిర్వహణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని, కార్మికులు తీవ్రంగా గాయపడుతున్నారని అన్నారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ, యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రమాదాల సమయంలో మాత్రమే అధికారులు స్పందించి, తరువాత నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అందువల్ల వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, నోష్ ల్యాబ్ ఫార్మా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ఎన్. నాగయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News