Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆలయ సన్నిధిలో ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ. స్వామివారి నిత్య రాబడి రూ.11.45 లక్షలు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 08:25 PM

నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి

నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి

నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి
April 10, 2026 06:49 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఉన్న నోష్ ల్యాబ్ ఫార్మా కంపెనీ కార్మికులకు భద్రత కల్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఆ సంస్థపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారి ఎం. మోతిలాల్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ, కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి లాభాల కోసం కంపెనీ నిర్వహణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని, కార్మికులు తీవ్రంగా గాయపడుతున్నారని అన్నారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ, యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రమాదాల సమయంలో మాత్రమే అధికారులు స్పందించి, తరువాత నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అందువల్ల వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, నోష్ ల్యాబ్ ఫార్మా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ఎన్. నాగయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News