నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్ల సన్మానం
నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్ల సన్మానం
Editor Desk
రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో శోభనాద్రిపురం సర్పంచ్ కంచి మధుసూదన్ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, మాజీ డి.ఈ బొడ్డు సురేందర్లను కూడా ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, నియోజకవర్గం ఏర్పాటు ప్రతి ఒక్కరికీ అవసరమని, అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, యువత, విద్యావేత్తలు కలిసి ఉద్యమించి నియోజకవర్గ సాధనకు ముందుకు రావాలని కోరారు.
డీలిమిటేషన్ కమిటీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, మంత్రులను కలిసి నియోజకవర్గం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. మండలంలోని అన్ని వర్గాలు ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాధన సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, సహాయ కార్యదర్శి ఎండి ఫజల్, సలహాదారులు గంగాపురం యాదయ్య, ఉపాధ్యక్షులు కూనూరు కృష్ణ, బొడ్డు శంకరయ్య, రచ్చ యాదగిరి, ఎండి ఇమామ్ సాహెబ్, గంగాపురం వెంకటయ్య, దండుగుల రాములు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి