Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:48 PM

నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్‌ల సన్మానం

నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్‌ల సన్మానం

నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్‌ల సన్మానం
11-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో శోభనాద్రిపురం సర్పంచ్ కంచి మధుసూదన్‌ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, మాజీ డి.ఈ బొడ్డు సురేందర్‌లను కూడా ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, నియోజకవర్గం ఏర్పాటు ప్రతి ఒక్కరికీ అవసరమని, అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, యువత, విద్యావేత్తలు కలిసి ఉద్యమించి నియోజకవర్గ సాధనకు ముందుకు రావాలని కోరారు.

డీలిమిటేషన్ కమిటీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, మంత్రులను కలిసి నియోజకవర్గం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. మండలంలోని అన్ని వర్గాలు ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాధన సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, సహాయ కార్యదర్శి ఎండి ఫజల్, సలహాదారులు గంగాపురం యాదయ్య, ఉపాధ్యక్షులు కూనూరు కృష్ణ, బొడ్డు శంకరయ్య, రచ్చ యాదగిరి, ఎండి ఇమామ్ సాహెబ్, గంగాపురం వెంకటయ్య, దండుగుల రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్‌ల సన్మానం

Article Image

రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో శోభనాద్రిపురం సర్పంచ్ కంచి మధుసూదన్‌ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, మాజీ డి.ఈ బొడ్డు సురేందర్‌లను కూడా ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, నియోజకవర్గం ఏర్పాటు ప్రతి ఒక్కరికీ అవసరమని, అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, యువత, విద్యావేత్తలు కలిసి ఉద్యమించి నియోజకవర్గ సాధనకు ముందుకు రావాలని కోరారు.

డీలిమిటేషన్ కమిటీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, మంత్రులను కలిసి నియోజకవర్గం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. మండలంలోని అన్ని వర్గాలు ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాధన సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, సహాయ కార్యదర్శి ఎండి ఫజల్, సలహాదారులు గంగాపురం యాదయ్య, ఉపాధ్యక్షులు కూనూరు కృష్ణ, బొడ్డు శంకరయ్య, రచ్చ యాదగిరి, ఎండి ఇమామ్ సాహెబ్, గంగాపురం వెంకటయ్య, దండుగుల రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News