నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య
నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య
Editor Desk
రామన్నపేట నియోజకవర్గ సాధన కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని మాజీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
రామన్నపేట మండలం మరియు పరిసర ప్రాంత ప్రజలు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. నియోజకవర్గ సాధన కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, దేశ స్థాయి వరకు సమన్వయంతో పోరాటం చేపట్టాలని పేర్కొన్నారు.
జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి అధికారులను కలిసి రామన్నపేట ప్రాంత భౌగోళిక పరిస్థితులు, చారిత్రక ప్రాధాన్యతను వివరించి, ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని చాటాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని తెలిపారు.
రామన్నపేట నియోజకవర్గం ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధికి వేగం చేకూరుతుందని, ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని అన్నారు. అందుకే అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని దుర్గయ్య యాదవ్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి