Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు చేతిలో రూ. 40, అకౌంట్‌లో రూ. 44… కేవలం రూ. 84 ఆస్తితో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి ఆష్నా తంపి సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 08:41 PM

నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య

నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య

నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య
April 04, 2026 06:09 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ సాధన కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని మాజీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలం మరియు పరిసర ప్రాంత ప్రజలు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. నియోజకవర్గ సాధన కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, దేశ స్థాయి వరకు సమన్వయంతో పోరాటం చేపట్టాలని పేర్కొన్నారు.

జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి అధికారులను కలిసి రామన్నపేట ప్రాంత భౌగోళిక పరిస్థితులు, చారిత్రక ప్రాధాన్యతను వివరించి, ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని చాటాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని తెలిపారు.

రామన్నపేట నియోజకవర్గం ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధికి వేగం చేకూరుతుందని, ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని అన్నారు. అందుకే అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని దుర్గయ్య యాదవ్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News