Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 PM

నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య

నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య

నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య
04-04-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ సాధన కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని మాజీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలం మరియు పరిసర ప్రాంత ప్రజలు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. నియోజకవర్గ సాధన కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, దేశ స్థాయి వరకు సమన్వయంతో పోరాటం చేపట్టాలని పేర్కొన్నారు.

జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి అధికారులను కలిసి రామన్నపేట ప్రాంత భౌగోళిక పరిస్థితులు, చారిత్రక ప్రాధాన్యతను వివరించి, ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని చాటాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని తెలిపారు.

రామన్నపేట నియోజకవర్గం ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధికి వేగం చేకూరుతుందని, ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని అన్నారు. అందుకే అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని దుర్గయ్య యాదవ్ స్పష్టం చేశారు.

Sthanikam

నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య

Article Image

రామన్నపేట నియోజకవర్గ సాధన కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని మాజీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలం మరియు పరిసర ప్రాంత ప్రజలు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. నియోజకవర్గ సాధన కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, దేశ స్థాయి వరకు సమన్వయంతో పోరాటం చేపట్టాలని పేర్కొన్నారు.

జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి అధికారులను కలిసి రామన్నపేట ప్రాంత భౌగోళిక పరిస్థితులు, చారిత్రక ప్రాధాన్యతను వివరించి, ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని చాటాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని తెలిపారు.

రామన్నపేట నియోజకవర్గం ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధికి వేగం చేకూరుతుందని, ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని అన్నారు. అందుకే అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని దుర్గయ్య యాదవ్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News