నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
Editor Desk
ఖమ్మం, : కేంద్రంలోని Bharatiya Janata Party ప్రభుత్వం, రాష్ట్రంలోని Indian National Congress ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాయని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి. రాకేష్ ఆరోపించారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం పి.వై.ఎల్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు జాటోత్ ప్రేమ్ సింగ్ అధ్యక్షత వహించగా, ఎన్.వి. రాకేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 1.90 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ అమలు కాలేదని, నిరుద్యోగ భృతి గురించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత నోటిఫికేషన్లు లేక తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని ప్రధాని Narendra Modi ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని, కానీ ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. దేశంలో పీజీ, పీహెచ్డీ చదివిన యువత కూడా ఉపాధి లేక డిగ్రీలతో తిరుగుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభంలో ఆర్భాటంగా ప్రకటించిన Rajiv Yuva Vikasam Scheme కింద ఐదు లక్షల మందికి మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. అయితే దరఖాస్తులు చేసుకుని ఏడాది గడిచినా చాలా మంది అర్హులకు రుణాలు అందలేదని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులకు తక్షణమే అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరారు.
ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించకపోతే పి.వై.ఎల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జిక్కుల భరత్, ఉపాధ్యక్షులు సీహెచ్ ధరణి కృష్ణ, నాయకులు గోడ్డెటి అశోక్, ఇస్లావత్ రమేష్, మామిడాల వెంకటేష్, కొత్త రమేష్, మాలాది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి