నిలిచిపోయి దురవాసన వస్తున్న మురుగు నీరును తొలగించండి
నిలిచిపోయి దురవాసన వస్తున్న మురుగు నీరును తొలగించండి
Prakash
మా ప్రాంతంలో నిలిచిపోయిన మురుగునీరు మరియు దోమల బెడదను నివారించండి.
సోమందేపల్లి గ్రామం బాలాజీ నగర్ ప్రాంతంలో మేము ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యను మీ దృష్టికి తీసుకువస్తున్నాము.
మా నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో గత కొంతకాలంగా మురుగునీరు నిలిచిపోయి ఒక పెద్ద బురద గుంటలా తయారైంది. ఆ నీరు నిల్వ ఉండటం వల్ల విపరీతంగా దోమలు పెరుగుతున్నాయి. దీనివల్ల రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మురుగునీటి వల్ల దుర్వాసన కూడా వస్తోంది.
కావున, దయచేసి వెంటనే స్పందించి, నిలిచిపోయిన ఆ నీటిని తొలగించి, ఆ ప్రాంతంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలని లేదా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
త్వరలోనే మా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాము.
బాలాజీ నగర్ వాసులు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి