Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 09:02 PM

నిదానపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు

నిదానపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు

నిదానపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు
April 07, 2026 07:17 PM 189 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రామన్నపేట ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు మాట్లాడుతూ సైబర్ నేరాలపై జాగ్రత్తలు, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాధాన్యం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చైన్ స్నాచింగ్ నివారణ చర్యలపై గ్రామస్తులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ చిన్నారుల రక్షణలో సమాజ బాధ్యతను గుర్తుచేశారు. బాల్య వివాహాల నివారణపై చట్టపరమైన అంశాలను వివరించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది నరసింహ, సురేష్, మధు, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News