Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:05 AM

నిదానపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు

నిదానపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు

నిదానపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు
April 07, 2026 07:17 PM 435 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రామన్నపేట ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు మాట్లాడుతూ సైబర్ నేరాలపై జాగ్రత్తలు, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాధాన్యం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చైన్ స్నాచింగ్ నివారణ చర్యలపై గ్రామస్తులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ చిన్నారుల రక్షణలో సమాజ బాధ్యతను గుర్తుచేశారు. బాల్య వివాహాల నివారణపై చట్టపరమైన అంశాలను వివరించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది నరసింహ, సురేష్, మధు, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News