Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:34 AM

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు – కలెక్టర్ హనుమంతరావు

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు – కలెక్టర్ హనుమంతరావు

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు – కలెక్టర్ హనుమంతరావు
February 24, 2026 10:07 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పరిశ్రమల్లో భద్రతా లోపాలపై గట్టి హెచ్చరిక

జిల్లాలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు, పేలుళ్లు వంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. నిర్లక్ష్యం ప్రాణనష్టాలకు దారితీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణలతో కలిసి పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు, పేలుళ్ల నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రమాదకర కర్మాగారాలపై ప్రత్యేక నిఘా

జిల్లాలోని రసాయన, బల్క్ డ్రగ్స్ మరియు ప్రమాదకర కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు కావాలని కలెక్టర్ ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్మికుల ప్రాణ భద్రతే ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.

స్టీమ్‌కు ఆటో కట్–ఆఫ్ సిస్టమ్, రియాక్టర్లకు సేఫ్టీ వాల్వులు, రప్చర్ డిస్కులు వంటి కీలక భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. లోపాలు గుర్తిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ప్రమాదం జరిగితే తక్షణ చర్యలు

జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రమాదం సంభవించినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసి, విషవాయువుల ప్రభావం నివాస ప్రాంతాలపై పడకుండా వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు ముందస్తు ప్రణాళిక సిద్ధంగా ఉండాలన్నారు.

రెండు కర్మాగారాలకు నిషేధ ఉత్తర్వులు

తీవ్ర భద్రతా లోపాలు, చట్ట ఉల్లంఘనలు గుర్తించిన నేపథ్యంలో బృందవాన్ లబోరా్టోరీస్ , వి .జె . సాయి కెమికల్స్క కార్మాగారాలకు నిషేధ ఉత్తర్వులు జారీ చేసి, ప్రాసిక్యూషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి వెల్లడించారు.

సమావేశంలో డీఐసీ రవీందర్, జిల్లా ఫైర్ అధికారి సందేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News