నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
Editor Desk
మునిపంపుల
ఎండాకాలంలో నీటిని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రజలను కోరారు. గృహాల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.
గ్రామంలోని బోటిమీదగూడెంలో వార్డు సభ్యుడు మేకల జలందర్తో కలిసి ఇంటింటికి తిరిగి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి కొరత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేస్తూ వినియోగించాలని, అందరికీ సరిపడేలా సహకరించాలని కోరారు.
ఇళ్ల ముందు మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని అవగాహన కల్పించారు.
గ్రామపంచాయతీ అనుమతి లేకుండా కొత్త గృహ నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామపంచాయతీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు మేకల జలందర్, గ్రామపంచాయతీ సిబ్బంది బూడిద మారయ్య, బూడిద ముత్తయ్య, శిరీషాల స్వామి, కొమిరే తిరుమలేష్, శిరీషాల సుధీర్, శిరీషాల గణేష్, జంగం యాదయ్య, శిరీషాల సురేష్, మిర్యాల రాములు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి