Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:06 AM

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
25-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల

ఎండాకాలంలో నీటిని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రజలను కోరారు. గృహాల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.

గ్రామంలోని బోటిమీదగూడెంలో వార్డు సభ్యుడు మేకల జలందర్‌తో కలిసి ఇంటింటికి తిరిగి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి కొరత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేస్తూ వినియోగించాలని, అందరికీ సరిపడేలా సహకరించాలని కోరారు.

ఇళ్ల ముందు మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని అవగాహన కల్పించారు.

గ్రామపంచాయతీ అనుమతి లేకుండా కొత్త గృహ నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామపంచాయతీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు మేకల జలందర్, గ్రామపంచాయతీ సిబ్బంది బూడిద మారయ్య, బూడిద ముత్తయ్య, శిరీషాల స్వామి, కొమిరే తిరుమలేష్, శిరీషాల సుధీర్, శిరీషాల గణేష్, జంగం యాదయ్య, శిరీషాల సురేష్, మిర్యాల రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

Article Image

మునిపంపుల

ఎండాకాలంలో నీటిని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రజలను కోరారు. గృహాల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.

గ్రామంలోని బోటిమీదగూడెంలో వార్డు సభ్యుడు మేకల జలందర్‌తో కలిసి ఇంటింటికి తిరిగి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి కొరత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేస్తూ వినియోగించాలని, అందరికీ సరిపడేలా సహకరించాలని కోరారు.

ఇళ్ల ముందు మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని అవగాహన కల్పించారు.

గ్రామపంచాయతీ అనుమతి లేకుండా కొత్త గృహ నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామపంచాయతీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు మేకల జలందర్, గ్రామపంచాయతీ సిబ్బంది బూడిద మారయ్య, బూడిద ముత్తయ్య, శిరీషాల స్వామి, కొమిరే తిరుమలేష్, శిరీషాల సుధీర్, శిరీషాల గణేష్, జంగం యాదయ్య, శిరీషాల సురేష్, మిర్యాల రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News