Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:18 PM

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
April 25, 2026 06:47 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల

ఎండాకాలంలో నీటిని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రజలను కోరారు. గృహాల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.

గ్రామంలోని బోటిమీదగూడెంలో వార్డు సభ్యుడు మేకల జలందర్‌తో కలిసి ఇంటింటికి తిరిగి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి కొరత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేస్తూ వినియోగించాలని, అందరికీ సరిపడేలా సహకరించాలని కోరారు.

ఇళ్ల ముందు మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని అవగాహన కల్పించారు.

గ్రామపంచాయతీ అనుమతి లేకుండా కొత్త గృహ నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామపంచాయతీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు మేకల జలందర్, గ్రామపంచాయతీ సిబ్బంది బూడిద మారయ్య, బూడిద ముత్తయ్య, శిరీషాల స్వామి, కొమిరే తిరుమలేష్, శిరీషాల సుధీర్, శిరీషాల గణేష్, జంగం యాదయ్య, శిరీషాల సురేష్, మిర్యాల రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News