Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 05:58 PM

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
April 25, 2026 06:47 PM 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల

ఎండాకాలంలో నీటిని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రజలను కోరారు. గృహాల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.

గ్రామంలోని బోటిమీదగూడెంలో వార్డు సభ్యుడు మేకల జలందర్‌తో కలిసి ఇంటింటికి తిరిగి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి కొరత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేస్తూ వినియోగించాలని, అందరికీ సరిపడేలా సహకరించాలని కోరారు.

ఇళ్ల ముందు మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని అవగాహన కల్పించారు.

గ్రామపంచాయతీ అనుమతి లేకుండా కొత్త గృహ నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామపంచాయతీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు మేకల జలందర్, గ్రామపంచాయతీ సిబ్బంది బూడిద మారయ్య, బూడిద ముత్తయ్య, శిరీషాల స్వామి, కొమిరే తిరుమలేష్, శిరీషాల సుధీర్, శిరీషాల గణేష్, జంగం యాదయ్య, శిరీషాల సురేష్, మిర్యాల రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News