నాగార్జున ప్రభుత్వ కళాశాల, : తెలుగులో నెట్, సెట్ పరీక్షల్లో ఎన్జి కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కళాశాలలో ఎం.ఏ తెలుగు అభ్యసించిన కందుల ఏడుకొండలు యుజిసి నెట్లో, బరిగెల శ్రవణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సెట్లో అర్హత సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగుశాఖాధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్ విద్యార్థులను అభినందించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.
విజేతలను శాలువాలతో సత్కరించి, పూలగుచ్ఛాలు అందజేశారు. క్రమశిక్షణతో కూడిన పట్టుదల ఉంటే లక్ష్యాలను సాధించవచ్చని ప్రిన్సిపాల్ సూచించారు.
కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డా. టి. సైదులు, డా. వాస భూపాల్, ప్రభాకర్, అంజయ్య, లింగస్వామి తదితరులు, విద్యార్థులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి