నేలపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
నేలపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
K.RAVI
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: సంఘం అధ్యక్షులు బూడిద లింగస్వామి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని బాబాసాహెబ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా నేలపట్ల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూడిద లింగస్వామి, గౌరవ అధ్యక్షులు బూడిద ఎట్టయ్య మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన ఆయన బాటలో యువత నడవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో 7వ వార్డు సభ్యులు కత్తుల సాయికుమార్, సంఘం కార్యదర్శి ఎనమల్ల సుదర్శన్, మధు కుమార్, నాగరాజు, కిరణ్, శివ, శ్యామ్, కార్తీక్, యశ్వంత్, విహాన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి