Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

నేలపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నేలపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నేలపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: సంఘం అధ్యక్షులు బూడిద లింగస్వామి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని బాబాసాహెబ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా నేలపట్ల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూడిద లింగస్వామి, గౌరవ అధ్యక్షులు బూడిద ఎట్టయ్య మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన ఆయన బాటలో యువత నడవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో 7వ వార్డు సభ్యులు కత్తుల సాయికుమార్, సంఘం కార్యదర్శి ఎనమల్ల సుదర్శన్, మధు కుమార్, నాగరాజు, కిరణ్, శివ, శ్యామ్, కార్తీక్, యశ్వంత్, విహాన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేలపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: సంఘం అధ్యక్షులు బూడిద లింగస్వామి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని బాబాసాహెబ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా నేలపట్ల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూడిద లింగస్వామి, గౌరవ అధ్యక్షులు బూడిద ఎట్టయ్య మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన ఆయన బాటలో యువత నడవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో 7వ వార్డు సభ్యులు కత్తుల సాయికుమార్, సంఘం కార్యదర్శి ఎనమల్ల సుదర్శన్, మధు కుమార్, నాగరాజు, కిరణ్, శివ, శ్యామ్, కార్తీక్, యశ్వంత్, విహాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News