Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:10 PM

న్యాల్కల్ బస్టాండ్‌లో భారత్ గ్యాస్ వాహనం నిలిపివేత.. వినియోగదారుల ఆగ్రహం

న్యాల్కల్ బస్టాండ్‌లో భారత్ గ్యాస్ వాహనం నిలిపివేత.. వినియోగదారుల ఆగ్రహం

న్యాల్కల్ బస్టాండ్‌లో భారత్ గ్యాస్ వాహనం నిలిపివేత.. వినియోగదారుల ఆగ్రహం
March 14, 2026 03:58 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో భారత్ గ్యాస్ (స్వరాజ్) సరఫరాపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ ఇంటికి రాకపోయినా డెలివరీ అయినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని పలువురు వినియోగదారులు ఆరోపించారు. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికులు గ్యాస్ సరఫరా వాహనాన్ని బస్టాండ్ ప్రాంగణంలో రెండు నుంచి మూడు గంటల పాటు నిలిపివేశారు.

ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన అద్నూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వినియోగదారులతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పారు. గ్యాస్ సరఫరా వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం గ్యాస్ సరఫరా వాహనం యథావిధిగా పంపిణీ కొనసాగించగా వినియోగదారులు సిలిండర్లను స్వీకరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News