Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:15 AM

న్యాల్కల్ బస్టాండ్‌లో భారత్ గ్యాస్ వాహనం నిలిపివేత.. వినియోగదారుల ఆగ్రహం

న్యాల్కల్ బస్టాండ్‌లో భారత్ గ్యాస్ వాహనం నిలిపివేత.. వినియోగదారుల ఆగ్రహం

న్యాల్కల్ బస్టాండ్‌లో భారత్ గ్యాస్ వాహనం నిలిపివేత.. వినియోగదారుల ఆగ్రహం
March 14, 2026 03:58 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో భారత్ గ్యాస్ (స్వరాజ్) సరఫరాపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ ఇంటికి రాకపోయినా డెలివరీ అయినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని పలువురు వినియోగదారులు ఆరోపించారు. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికులు గ్యాస్ సరఫరా వాహనాన్ని బస్టాండ్ ప్రాంగణంలో రెండు నుంచి మూడు గంటల పాటు నిలిపివేశారు.

ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన అద్నూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వినియోగదారులతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పారు. గ్యాస్ సరఫరా వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం గ్యాస్ సరఫరా వాహనం యథావిధిగా పంపిణీ కొనసాగించగా వినియోగదారులు సిలిండర్లను స్వీకరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News