నాటు సారాయి నేరాలపై చింతలపూడి ఎక్సైజ్ అధికారుల ఉక్కుపాదం – పలు గ్రామాల్లో సంయుక్త దాడులు
నాటు సారాయి నేరాలపై చింతలపూడి ఎక్సైజ్ అధికారుల ఉక్కుపాదం – పలు గ్రామాల్లో సంయుక్త దాడులు
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది సంయుక్తంగా నాటు సారాయి నేరాల నివారణ కోసం పలు గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాగిరెడ్డిగూడెం, పంతంగలగూడెం, రేచర్ల, తిమ్మిరెడ్డిపల్లి, ప్రగడవరం గ్రామాలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన నవోదయం 2.0 లో భాగంగా గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించి నాటు సారాయి తయారీ, విక్రయం చట్ట విరుద్ధమని వివరించారు. నాటు సారాయి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇదే సమయంలో లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఒక మహిళ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 180 మిల్లీలీటర్ల పరిమాణం గల 10 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అదనంగా లింగపాలెం మండల పరిధిలోని పలు మద్యం దుకాణాలలో కూడా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరిశీలించారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి