‘నారీ శక్తి వందన్’కు మద్దతు.. సంతకాల సేకరణ
‘నారీ శక్తి వందన్’కు మద్దతు.. సంతకాల సేకరణ
Editor Desk
భువనగిరి: మహిళా సాధికారతకు దోహదపడే ‘నారీ శక్తి వందన్ అధినియం’కు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. పట్టణంలోని పలు కళాశాలల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థినుల నుంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, నారీ శక్తి వందన్ అధినియం భువనగిరి పార్లమెంట్ కో-కన్వీనర్ పట్నం కపిల్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. మహిళల భాగస్వామ్యం పెరిగితేనే దేశ అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఈ చట్టానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
కౌన్సిలర్లు వంగేటి సుచరిత, బండారు స్వర్ణలత చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, నాయకులు ఇండ్ల సత్యవతి, ఎంజాల మల్లిక, లక్ష్మి, పావని, లత, ఉషాకిరణ్, భరత్, శివలింగం, ప్రసన్న, నిర్మలతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి