Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:25 PM

‘నారీ శక్తి వందన్‌’కు మద్దతు.. సంతకాల సేకరణ

‘నారీ శక్తి వందన్‌’కు మద్దతు.. సంతకాల సేకరణ

‘నారీ శక్తి వందన్‌’కు మద్దతు.. సంతకాల సేకరణ
17-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: మహిళా సాధికారతకు దోహదపడే ‘నారీ శక్తి వందన్ అధినియం’కు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. పట్టణంలోని పలు కళాశాలల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థినుల నుంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, నారీ శక్తి వందన్ అధినియం భువనగిరి పార్లమెంట్ కో-కన్వీనర్ పట్నం కపిల్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. మహిళల భాగస్వామ్యం పెరిగితేనే దేశ అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఈ చట్టానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కౌన్సిలర్లు వంగేటి సుచరిత, బండారు స్వర్ణలత చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, నాయకులు ఇండ్ల సత్యవతి, ఎంజాల మల్లిక, లక్ష్మి, పావని, లత, ఉషాకిరణ్, భరత్, శివలింగం, ప్రసన్న, నిర్మలతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

‘నారీ శక్తి వందన్‌’కు మద్దతు.. సంతకాల సేకరణ

Article Image

భువనగిరి: మహిళా సాధికారతకు దోహదపడే ‘నారీ శక్తి వందన్ అధినియం’కు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. పట్టణంలోని పలు కళాశాలల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థినుల నుంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, నారీ శక్తి వందన్ అధినియం భువనగిరి పార్లమెంట్ కో-కన్వీనర్ పట్నం కపిల్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. మహిళల భాగస్వామ్యం పెరిగితేనే దేశ అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఈ చట్టానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కౌన్సిలర్లు వంగేటి సుచరిత, బండారు స్వర్ణలత చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, నాయకులు ఇండ్ల సత్యవతి, ఎంజాల మల్లిక, లక్ష్మి, పావని, లత, ఉషాకిరణ్, భరత్, శివలింగం, ప్రసన్న, నిర్మలతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News