నల్లగొండ జిల్లా నార్కట్పల్లి బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ రక్షణతో పాటు కార్మికుల సమస్యల సాధన కోసం జరుగుతున్న ఈ సమ్మెలో ఆయన పాల్గొని మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ రక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికులకు అండగా నిలవాలని కోరారు.
సమ్మెలో పాల్గొన్న కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి