నాలుగు మండలాలకు పీఎన్జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్
నాలుగు మండలాలకు పీఎన్జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, వలిగొండ మండలాలకు పైప్లైన్ ద్వారా గృహ వినియోగదారులకు పీఎన్జీ (Piped Natural Gas) గ్యాస్ సరఫరా అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
బుధవారం మినీ మీటింగ్ హాల్లో జిల్లారెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, అడిషనల్ ఎస్పీ లక్ష్మినారాయణతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎన్జీ అమలు పురోగతిని పరిశీలించారు.
జిల్లాలో నాలుగు మండలాల్లో గ్యాస్ పైప్లైన్ ద్వారా గృహాలకు సురక్షితంగా, నిరంతర సరఫరా అందించేందుకు చేపడుతున్న పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పైప్లైన్ పనులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
రెవెన్యూ, మున్సిపల్, గ్రామపంచాయతీ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పనుల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్ల తవ్వకాలు, డ్రైనేజీ, మరమ్మత్తుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులు నిర్వహించాలని, పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, సిటీ గ్యాస్ ప్రతినిధులు రమేష్, వంశీ, జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి