Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయండి: అదనపు కలెక్టర్ “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 09:08 PM

నాలుగు మండలాలకు పీఎన్‌జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్

నాలుగు మండలాలకు పీఎన్‌జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్

నాలుగు మండలాలకు పీఎన్‌జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్
April 08, 2026 06:48 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, వలిగొండ మండలాలకు పైప్‌లైన్ ద్వారా గృహ వినియోగదారులకు పీఎన్‌జీ (Piped Natural Gas) గ్యాస్ సరఫరా అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో జిల్లారెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, అడిషనల్ ఎస్పీ లక్ష్మినారాయణతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎన్‌జీ అమలు పురోగతిని పరిశీలించారు.

జిల్లాలో నాలుగు మండలాల్లో గ్యాస్ పైప్‌లైన్ ద్వారా గృహాలకు సురక్షితంగా, నిరంతర సరఫరా అందించేందుకు చేపడుతున్న పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ పనులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

రెవెన్యూ, మున్సిపల్, గ్రామపంచాయతీ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పనుల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్ల తవ్వకాలు, డ్రైనేజీ, మరమ్మత్తుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులు నిర్వహించాలని, పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, సిటీ గ్యాస్ ప్రతినిధులు రమేష్, వంశీ, జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News