Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:54 PM

నాలుగు మండలాలకు పీఎన్‌జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్

నాలుగు మండలాలకు పీఎన్‌జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్

నాలుగు మండలాలకు పీఎన్‌జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్
08-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, వలిగొండ మండలాలకు పైప్‌లైన్ ద్వారా గృహ వినియోగదారులకు పీఎన్‌జీ (Piped Natural Gas) గ్యాస్ సరఫరా అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో జిల్లారెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, అడిషనల్ ఎస్పీ లక్ష్మినారాయణతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎన్‌జీ అమలు పురోగతిని పరిశీలించారు.

జిల్లాలో నాలుగు మండలాల్లో గ్యాస్ పైప్‌లైన్ ద్వారా గృహాలకు సురక్షితంగా, నిరంతర సరఫరా అందించేందుకు చేపడుతున్న పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ పనులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

రెవెన్యూ, మున్సిపల్, గ్రామపంచాయతీ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పనుల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్ల తవ్వకాలు, డ్రైనేజీ, మరమ్మత్తుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులు నిర్వహించాలని, పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, సిటీ గ్యాస్ ప్రతినిధులు రమేష్, వంశీ, జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Sthanikam

నాలుగు మండలాలకు పీఎన్‌జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, వలిగొండ మండలాలకు పైప్‌లైన్ ద్వారా గృహ వినియోగదారులకు పీఎన్‌జీ (Piped Natural Gas) గ్యాస్ సరఫరా అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో జిల్లారెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, అడిషనల్ ఎస్పీ లక్ష్మినారాయణతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎన్‌జీ అమలు పురోగతిని పరిశీలించారు.

జిల్లాలో నాలుగు మండలాల్లో గ్యాస్ పైప్‌లైన్ ద్వారా గృహాలకు సురక్షితంగా, నిరంతర సరఫరా అందించేందుకు చేపడుతున్న పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ పనులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

రెవెన్యూ, మున్సిపల్, గ్రామపంచాయతీ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పనుల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్ల తవ్వకాలు, డ్రైనేజీ, మరమ్మత్తుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులు నిర్వహించాలని, పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, సిటీ గ్యాస్ ప్రతినిధులు రమేష్, వంశీ, జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News