నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలో పల్నాడు–సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపైకి వచ్చిన గేదెను ఢీకొట్టింది. ఈ ఘటనతో రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది.
ఈ ప్రమాదం కారణంగా నల్గొండ–మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. అయితే ప్రయాణికులు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా త్రుటిలో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి