నకిలీ పత్రాలతో భూమి మోసం – ఏడుగురు అరెస్ట్**
నకిలీ పత్రాలతో భూమి మోసం – ఏడుగురు అరెస్ట్**
RAPOLU LINGASWAMY
రంగారెడ్డి జిల్లా : పత్రాలు సృష్టించి భూమిని విక్రయించినట్లు చూపిస్తూ మోసానికి పాల్పడిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 395/2026 కింద కేసు నమోదు చేశారు. నిందితులు వల్లాల ప్రేమ్ కుమార్, కొటియా నాగేంద్ర ప్రసాద్, యెల్మటి సుకుమార్ రెడ్డి కలిసి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వంటి పత్రాలను నకిలీగా తయారు చేశారు. మహిళల పేర్లతో తప్పుడు వ్యక్తులను చూపిస్తూ పత్రాలు సిద్ధం చేసి,వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్ 645/1987 పేరుతో నకిలీ సేల్ డీడ్ రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నకిలీ పత్రాల ఆధారంగా అబ్దుల్లాపుర్మెట్ మండలం మునగనూరు గ్రామంలోని సర్వే నంబర్లు 60, 74, 75, 76లలో ఉన్న 400 చదరపు గజాల ఓపెన్ ప్లాట్ను గారిమెల్ల కామేశ్వర్రావుకు విక్రయించినట్లు చూపిస్తూ మోసం చేసినట్లు వెల్లడించారు. ఈ మోసానికి ఇతర నిందితులు కూడా సహకరించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు స్మార్ట్ మొబైల్ ఫోన్లు, ఒక డెల్ ల్యాప్టాప్, నకిలీ సేల్ డీడ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసు దర్యాప్తు డీసీపీ డా. బి. అనురాధ పర్యవేక్షణలో అదనపు డిప్యూటీ కమిషనర్ కోటేశ్వర్రావు, వనస్థలిపురం ఏసీపీ పి.కాశిరెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మహేష్, ఎస్సై డి.నాగరాజు బృందం నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి