Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:46 AM

నకిలీ పత్రాలతో భూమి మోసం – ఏడుగురు అరెస్ట్**

నకిలీ పత్రాలతో భూమి మోసం – ఏడుగురు అరెస్ట్**

నకిలీ పత్రాలతో భూమి మోసం – ఏడుగురు అరెస్ట్**
March 12, 2026 05:08 AM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

రంగారెడ్డి జిల్లా : పత్రాలు సృష్టించి భూమిని విక్రయించినట్లు చూపిస్తూ మోసానికి పాల్పడిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 395/2026 కింద కేసు నమోదు చేశారు. నిందితులు వల్లాల ప్రేమ్ కుమార్, కొటియా నాగేంద్ర ప్రసాద్, యెల్మటి సుకుమార్ రెడ్డి కలిసి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వంటి పత్రాలను నకిలీగా తయారు చేశారు. మహిళల పేర్లతో తప్పుడు వ్యక్తులను చూపిస్తూ పత్రాలు సిద్ధం చేసి,వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్ 645/1987 పేరుతో నకిలీ సేల్ డీడ్ రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నకిలీ పత్రాల ఆధారంగా అబ్దుల్లాపుర్‌మెట్ మండలం మునగనూరు గ్రామంలోని సర్వే నంబర్లు 60, 74, 75, 76లలో ఉన్న 400 చదరపు గజాల ఓపెన్ ప్లాట్‌ను గారిమెల్ల కామేశ్వర్‌రావుకు విక్రయించినట్లు చూపిస్తూ మోసం చేసినట్లు వెల్లడించారు. ఈ మోసానికి ఇతర నిందితులు కూడా సహకరించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు స్మార్ట్ మొబైల్ ఫోన్లు, ఒక డెల్ ల్యాప్‌టాప్, నకిలీ సేల్ డీడ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తు డీసీపీ డా. బి. అనురాధ పర్యవేక్షణలో అదనపు డిప్యూటీ కమిషనర్ కోటేశ్వర్‌రావు, వనస్థలిపురం ఏసీపీ పి.కాశిరెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ మహేష్, ఎస్సై డి.నాగరాజు బృందం నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News