నాగిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
నాగిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
Editor Desk
నాగిరెడ్డిపల్లి
బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు చుక్క పద్మయ్య జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు, ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోడ పట్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు చింతల శంకర్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎస్.కె. షేర్ ఖాన్, గ్రామ ఉపాధ్యక్షుడు కందుకూరి నాగరాజు, గ్రామ జనరల్ సెక్రటరీ మధు, నాయకుడు సాబన్కార్ వెంకటేష్, గ్రామ ఉపసర్పంచి కాసాని రాజు పాల్గొన్నారు.
వార్డు సభ్యులు చింతల దేవేందర్ గౌడ్, జిట్ట మౌనిక సాయి రెడ్డి, చుక్క స్వామి, వనగంటి భాస్కర్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి