నాగిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
నాగిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Editor Desk
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి చౌరస్తాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించి భారత రాజ్యాంగ రూపకర్తగా, ప్రముఖ సామాజిక సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా సేవలందించిన మహనీయుడని పేర్కొన్నారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించారని తెలిపారు.
స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి, రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించిన అంబేద్కర్ గారికి మరణానంతరం 1990లో భారతరత్న పురస్కారం లభించిందని గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న ఆయన జయంతిని అధికారికంగా జరుపుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి.పి కేశవపట్నం రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు చుక్క పద్మయ్య, ఉప సర్పంచ్ క్యాసాని శేఖర్ యాదవ్, వార్డు సభ్యులు చింతల దేవేందర్ గౌడ్, ఎలిమినేటి సురేష్ రెడ్డి, జిట్టా మౌనిక ప్రశాంత్ రెడ్డి, గుండు ఉమారాణి, మాజీ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి