నాగార్జున స్కూల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
నాగార్జున స్కూల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
Editor Desk
రామన్నపేట మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.
పెట్రోల్ పంపుల్లో మంటలు చెలరేగినప్పుడు నీటితో కాకుండా ఇసుక, కార్బన్ డై ఆక్సైడ్, ఫోమ్ వంటి పదార్థాలతో మంటలను అదుపులోకి తీసుకురావాలని వివరించారు. భవనాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెలువడే దట్టమైన పొగ వల్ల ఆక్సిజన్ అందక ప్రాణాపాయం కలగవచ్చని తెలిపారు.
అలాంటి పరిస్థితుల్లో చేతి రుమాలను ముఖానికి కట్టుకుని నేలపై ప్రాకుతూ బయటకు రావాలని సూచించారు. అలాగే ఫైర్ ఇంజన్లో వాటర్ ఫిల్లింగ్ విధానం మరియు ఇతర అగ్నిమాపక పరికరాల వినియోగాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ నాగరాజు ఎన్., ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మధుసూధన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్. భీకు, డ్రైవర్ కాశీరాం, ఫైర్ ఫైటర్స్ జే. వెంకటేశ్వర్లు, సిచ్. మధు మరియు పాఠశాల బోధన సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి