Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:28 PM

నాగార్జున స్కూల్‌లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

నాగార్జున స్కూల్‌లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

నాగార్జున స్కూల్‌లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
10-03-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.

పెట్రోల్ పంపుల్లో మంటలు చెలరేగినప్పుడు నీటితో కాకుండా ఇసుక, కార్బన్ డై ఆక్సైడ్, ఫోమ్ వంటి పదార్థాలతో మంటలను అదుపులోకి తీసుకురావాలని వివరించారు. భవనాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెలువడే దట్టమైన పొగ వల్ల ఆక్సిజన్ అందక ప్రాణాపాయం కలగవచ్చని తెలిపారు.

అలాంటి పరిస్థితుల్లో చేతి రుమాలను ముఖానికి కట్టుకుని నేలపై ప్రాకుతూ బయటకు రావాలని సూచించారు. అలాగే ఫైర్ ఇంజన్‌లో వాటర్ ఫిల్లింగ్ విధానం మరియు ఇతర అగ్నిమాపక పరికరాల వినియోగాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ నాగరాజు ఎన్., ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మధుసూధన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్. భీకు, డ్రైవర్ కాశీరాం, ఫైర్ ఫైటర్స్ జే. వెంకటేశ్వర్లు, సిచ్. మధు మరియు పాఠశాల బోధన సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

నాగార్జున స్కూల్‌లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

Article Image

రామన్నపేట మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.

పెట్రోల్ పంపుల్లో మంటలు చెలరేగినప్పుడు నీటితో కాకుండా ఇసుక, కార్బన్ డై ఆక్సైడ్, ఫోమ్ వంటి పదార్థాలతో మంటలను అదుపులోకి తీసుకురావాలని వివరించారు. భవనాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెలువడే దట్టమైన పొగ వల్ల ఆక్సిజన్ అందక ప్రాణాపాయం కలగవచ్చని తెలిపారు.

అలాంటి పరిస్థితుల్లో చేతి రుమాలను ముఖానికి కట్టుకుని నేలపై ప్రాకుతూ బయటకు రావాలని సూచించారు. అలాగే ఫైర్ ఇంజన్‌లో వాటర్ ఫిల్లింగ్ విధానం మరియు ఇతర అగ్నిమాపక పరికరాల వినియోగాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ నాగరాజు ఎన్., ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మధుసూధన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్. భీకు, డ్రైవర్ కాశీరాం, ఫైర్ ఫైటర్స్ జే. వెంకటేశ్వర్లు, సిచ్. మధు మరియు పాఠశాల బోధన సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News