Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:21 PM

నేటి నుంచే జనగణన స్వీయ నమోదు..

నేటి నుంచే జనగణన స్వీయ నమోదు..

నేటి నుంచే జనగణన స్వీయ నమోదు..
April 25, 2026 07:16 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

మే 10 వరకు పోర్టల్‌లో వివరాల వెల్లడికి అవకాశం..

తొలిసారిగా కుల వివరాల సేకరణ అంతా డిజిటల్ మయం.. కలెక్టర్ బి. చంద్రశేఖర్


నల్గొండ : దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘జనగణన-2027’ ప్రక్రియలో భాగంగా ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వీయ గణన’ (Self Enumeration) విధానాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన ప్రక్రియ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రజలు తమ వివరాలను అధికారిక వెబ్ పోర్టల్ se.census.gov.in ద్వారా స్వయంగా నమోదు చేసుకోవాలని, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించారు.

నమోదు పూర్తయ్యాక మొబైల్ లేదా ఇమెయిల్‌కు వచ్చే ‘ఎస్.ఈ. ఐడీ’ని భద్రపరుచుకోవాలని తదుపరి దశలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే నమోదు ధృవీకరణ పూర్తవుతుందని వివరించారు. జనగణనను ప్రభుత్వం రెండు దశల్లో నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు. మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి విడతలో ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన ఉంటుందని, 2027 ఫిబ్రవరి 9 నుండి 28 వరకు తుది జనగణన ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న ఈ జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చేపట్టడమే కాకుండా ఈసారి ప్రత్యేకంగా కులం వివరాలను కూడా నమోదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 5,03,000 గృహాలు ఉండగా, వాటి గణన కోసం 3,729 హౌసింగ్ బ్లాక్ లు, 479 సర్కిళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం 3,179 మంది గణకులు, 531 మంది సూపర్వైజర్లు, 41 మంది చార్జి అధికారులను నియమించినట్లు వెల్లడించారు.​ జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తి చేశామని ఈ నెల 27 నుంచి మూడో విడత శిక్షణ ఇస్తామని కలెక్టర్ వివరించారు. స్వీయ గణనపై విస్తృత ప్రచారం కల్పించాలని ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు ఎంతో కీలకంగా మారుతాయని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సి.పి.ఓ. శ్రీనివాస్ నాయక్, డి.పి.ఆర్.ఓ. యు. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News