ముత్యాలమ్మ గుడి వద్ద ముమ్మరంగా సీసీ రోడ్డు పనులు
ముత్యాలమ్మ గుడి వద్ద ముమ్మరంగా సీసీ రోడ్డు పనులు
K.RAVI
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మున్సిపల్ చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో గల రజక సంఘం ముత్యాలమ్మ దేవాలయ ప్రాంగణంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు.గత కొన్నేళ్లుగా ఇక్కడ సరైన రహదారి సౌకర్యం లేక భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రజక సంఘం నాయకులు చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆమె, తక్షణమే నిధులు మంజూరు చేయించి పనులను మొదలుపెట్టారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.."వార్డులలోని మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. స్థానికుల విన్నపం మేరకు ముత్యాలమ్మ గుడి వద్ద భక్తులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం."తమ విన్నపానికి తక్షణమే స్పందించి పనులు ప్రారంభించినందుకు రజక సంఘం ప్రతినిధులు మున్సిపల్ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ దేప రమ్య రాజు, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి