PRINT TIME: April 24, 2026 02:56 PM
మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం
మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం
April 24, 2026 01:06 PM
9 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
అమరావతి/తాడేపల్లి: రాష్ట్ర బి.సి వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లోమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవితమ్మ కమ్మ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ మరియు పాలకమండలి సభ్యుల కార్యాలయాలను కూడా ప్రారంభించారు.
అనంతరం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఛాంబర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బ్రహ్మయ్య చౌదరి, డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పోలేని సూర్యనారాయణతో పాటు ఇతర డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవాన్ని అభినందించారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత సేవలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి