మండుతున్న ఎండల్లో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన పల్లపు బుద్ధుడు
మండుతున్న ఎండల్లో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన పల్లపు బుద్ధుడు
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలో మండుతున్న వేసవి తీవ్రత మధ్య ఉపాధి హామీ కూలీలకు చల్లని ఉపశమనం లభించింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో, గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము ముందుండి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కూలీలలో ఉత్సాహాన్ని నింపింది. ఎండల దాహాన్ని తీర్చడమే కాకుండా, వారి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిన పల్లపు బుద్ధుడు మరియు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, జన్నపాల రేణుక, రాచమళ్ళ సంధ్య, గురిజ మమత, రూపని వనజ, ఉయ్యాల లక్ష్మయ్యతో పాటు పలువురు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి