Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 04:21 PM

మందు పిచికారీతో మాడిపోయిన వరి పొలం

మందు పిచికారీతో మాడిపోయిన వరి పొలం

మందు పిచికారీతో మాడిపోయిన వరి పొలం
09-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి, : మండలంలోని మల్లాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని హట్యతండాలో ఓ రైతు సాగు చేసిన వరి పంట మందు పిచికారీ కారణంగా మాడిపోయింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బాదావత్ వీరన్న తన స్వంత 2.20 ఎకరాల పొలంలో వరి సాగు చేశారు. శనివారం ఓ కంపెనీకి చెందిన మందును పిచికారీ చేయగా, ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి చూసేసరికి వరి మొత్తం ఎర్రబడుతూ మాడిపోయినట్లు కనిపించింది.

దీంతో రైతు తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం రైతు బాదావత్ వీరన్నతో కలిసి మల్లాయిగూడెం సర్పంచ్ బాదావత్ నరేష్, హట్యతండా రైతులు బాదావత్ కృష్ణ, రాంబాబు, సాయి అనిల్, బాలాజీ తదితరులు వరి పొలాన్ని పరిశీలించారు.

పంట పూర్తిగా దెబ్బతినడంతో తాను తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు బాదావత్ వీరన్న కోరారు.

Sthanikam

మందు పిచికారీతో మాడిపోయిన వరి పొలం

Article Image

కూసుమంచి, : మండలంలోని మల్లాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని హట్యతండాలో ఓ రైతు సాగు చేసిన వరి పంట మందు పిచికారీ కారణంగా మాడిపోయింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బాదావత్ వీరన్న తన స్వంత 2.20 ఎకరాల పొలంలో వరి సాగు చేశారు. శనివారం ఓ కంపెనీకి చెందిన మందును పిచికారీ చేయగా, ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి చూసేసరికి వరి మొత్తం ఎర్రబడుతూ మాడిపోయినట్లు కనిపించింది.

దీంతో రైతు తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం రైతు బాదావత్ వీరన్నతో కలిసి మల్లాయిగూడెం సర్పంచ్ బాదావత్ నరేష్, హట్యతండా రైతులు బాదావత్ కృష్ణ, రాంబాబు, సాయి అనిల్, బాలాజీ తదితరులు వరి పొలాన్ని పరిశీలించారు.

పంట పూర్తిగా దెబ్బతినడంతో తాను తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు బాదావత్ వీరన్న కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News