మందు పిచికారీతో మాడిపోయిన వరి పొలం
మందు పిచికారీతో మాడిపోయిన వరి పొలం
Editor Desk
కూసుమంచి, : మండలంలోని మల్లాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని హట్యతండాలో ఓ రైతు సాగు చేసిన వరి పంట మందు పిచికారీ కారణంగా మాడిపోయింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బాదావత్ వీరన్న తన స్వంత 2.20 ఎకరాల పొలంలో వరి సాగు చేశారు. శనివారం ఓ కంపెనీకి చెందిన మందును పిచికారీ చేయగా, ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి చూసేసరికి వరి మొత్తం ఎర్రబడుతూ మాడిపోయినట్లు కనిపించింది.
దీంతో రైతు తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం రైతు బాదావత్ వీరన్నతో కలిసి మల్లాయిగూడెం సర్పంచ్ బాదావత్ నరేష్, హట్యతండా రైతులు బాదావత్ కృష్ణ, రాంబాబు, సాయి అనిల్, బాలాజీ తదితరులు వరి పొలాన్ని పరిశీలించారు.
పంట పూర్తిగా దెబ్బతినడంతో తాను తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు బాదావత్ వీరన్న కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి