Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 08:11 PM

మండే ఎండల్లో మజ్జిగ పంపిణీ.మొద్దు లచ్చి రెడ్డి

మండే ఎండల్లో మజ్జిగ పంపిణీ.మొద్దు లచ్చి రెడ్డి

మండే ఎండల్లో మజ్జిగ పంపిణీ.మొద్దు లచ్చి రెడ్డి
April 25, 2026 06:25 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్,

మండే ఎండల్లో ప్రజలకు ఊరటనిచ్చే విధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి అన్నారు.

బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ స్వామి వివేకానంద పార్క్ వద్ద వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యంలో, కె.ఎస్.ఆర్ ఆంజనేయులు సహకారంతో వైశాఖ మాసం సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లచ్చిరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహం తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతి కాలనీ, ప్రతి వీధిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవా భావాన్ని సమాజంలో పెంపొందించాలని సూచించారు. మండే ఎండల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సామాజిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ రావు, భక్త సమాజం అధ్యక్షుడు సిహెచ్.వి.ఆర్.కే మూర్తి, ఆంజనేయులు, వెంకట సాయిరాం, రవిశర్మ, ఉమాశంకర్, కృపాకరణ్, శిష్ట శర్మ, వెంకట ముత్యాలు, బాల నాగేశ్వర్, ఉపాధ్యక్షుడు పవన్ రెడ్డి, నాయకులు మణిపాల్ రెడ్డి, శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News