మండే ఎండల్లో మజ్జిగ పంపిణీ.మొద్దు లచ్చి రెడ్డి
మండే ఎండల్లో మజ్జిగ పంపిణీ.మొద్దు లచ్చి రెడ్డి
Editor Desk
ఎల్బీనగర్,
మండే ఎండల్లో ప్రజలకు ఊరటనిచ్చే విధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి అన్నారు.
బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ స్వామి వివేకానంద పార్క్ వద్ద వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యంలో, కె.ఎస్.ఆర్ ఆంజనేయులు సహకారంతో వైశాఖ మాసం సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లచ్చిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహం తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతి కాలనీ, ప్రతి వీధిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవా భావాన్ని సమాజంలో పెంపొందించాలని సూచించారు. మండే ఎండల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సామాజిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ రావు, భక్త సమాజం అధ్యక్షుడు సిహెచ్.వి.ఆర్.కే మూర్తి, ఆంజనేయులు, వెంకట సాయిరాం, రవిశర్మ, ఉమాశంకర్, కృపాకరణ్, శిష్ట శర్మ, వెంకట ముత్యాలు, బాల నాగేశ్వర్, ఉపాధ్యక్షుడు పవన్ రెడ్డి, నాయకులు మణిపాల్ రెడ్డి, శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి