Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 05:50 PM

మండే ఎండల్లో మజ్జిగ పంపిణీ.మొద్దు లచ్చి రెడ్డి

మండే ఎండల్లో మజ్జిగ పంపిణీ.మొద్దు లచ్చి రెడ్డి

మండే ఎండల్లో మజ్జిగ పంపిణీ.మొద్దు లచ్చి రెడ్డి
April 25, 2026 06:25 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్,

మండే ఎండల్లో ప్రజలకు ఊరటనిచ్చే విధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి అన్నారు.

బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ స్వామి వివేకానంద పార్క్ వద్ద వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యంలో, కె.ఎస్.ఆర్ ఆంజనేయులు సహకారంతో వైశాఖ మాసం సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లచ్చిరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహం తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతి కాలనీ, ప్రతి వీధిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవా భావాన్ని సమాజంలో పెంపొందించాలని సూచించారు. మండే ఎండల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సామాజిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ రావు, భక్త సమాజం అధ్యక్షుడు సిహెచ్.వి.ఆర్.కే మూర్తి, ఆంజనేయులు, వెంకట సాయిరాం, రవిశర్మ, ఉమాశంకర్, కృపాకరణ్, శిష్ట శర్మ, వెంకట ముత్యాలు, బాల నాగేశ్వర్, ఉపాధ్యక్షుడు పవన్ రెడ్డి, నాయకులు మణిపాల్ రెడ్డి, శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News