PRINT TIME: April 10, 2026 10:03 PM
మార్నింగ్ వాక్తో ప్రజా సమస్యలపై దృష్టి
మార్నింగ్ వాక్తో ప్రజా సమస్యలపై దృష్టి
April 10, 2026 08:04 PM
33 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి మండలం,
నాగిరెడ్డిపల్లి పరిధిలో మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా గ్రామ సమస్యలను నేరుగా ప్రజల నుండి తెలుసుకునే కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 6, 7, 8 వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధిని ప్రధాన కర్తవ్యంగా భావిస్తూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలను పలకరిస్తూ, జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి