Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:45 PM

మార్నింగ్ వాక్‌తో ప్రజా సమస్యలపై దృష్టి

మార్నింగ్ వాక్‌తో ప్రజా సమస్యలపై దృష్టి

మార్నింగ్ వాక్‌తో ప్రజా సమస్యలపై దృష్టి
April 10, 2026 08:04 PM 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలం,

నాగిరెడ్డిపల్లి పరిధిలో మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా గ్రామ సమస్యలను నేరుగా ప్రజల నుండి తెలుసుకునే కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 6, 7, 8 వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధిని ప్రధాన కర్తవ్యంగా భావిస్తూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలను పలకరిస్తూ, జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News