Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:02 PM

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోరాట దినంగా జరపాలి – పి.ఓ.డబ్ల్యూ కార్యదర్శి గోకినపల్లి సరోజిని

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోరాట దినంగా జరపాలి – పి.ఓ.డబ్ల్యూ కార్యదర్శి గోకినపల్లి సరోజిని

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోరాట దినంగా జరపాలి – పి.ఓ.డబ్ల్యూ కార్యదర్శి గోకినపల్లి సరోజిని
March 05, 2026 07:43 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళల ఉపాధిని దెబ్బతీసే వి.బి.జి రాంజీ పథకాన్ని వ్యతిరేకించండి

పిండిప్రోలు: నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మరింతగా పెరిగాయని ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ) పాలేరు డివిజన్ ప్రధాన కార్యదర్శి గోకినపల్లి సరోజిని అన్నారు.

పిండిప్రోలు గ్రామంలోని రాయల వెంకట్ నారాయణ భవన్‌లో డివిజన్ అధ్యక్షురాలు శీలం పూలక్క అధ్యక్షతన నిర్వహించిన మహిళల ముఖ్య జనరల్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించిందని విమర్శించారు. పారిశ్రామిక, అసంఘటిత, సంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, వేతనాల్లో వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు.

మహిళలపై అసమానత్వం, అణచివేత, వివక్ష, పురుషాధిపత్యం వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళల హక్కుల సాధన కోసం ముందుకు సాగడమే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క అసలు ఉద్దేశమని చెప్పారు.

1908 మార్చి 8న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళా కార్మికులు పనిగంటల తగ్గింపు, వేతనాల పెంపు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించుకున్న చరిత్ర ఉందన్నారు. అందుకే మార్చి 8ను పండుగలా కాకుండా మహిళల హక్కుల కోసం పోరాట దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బందెల లలిత, కుంబజడ భారతమ్మ, కే సత్యవతి, అయితేనా బోయిన సునీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News