Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్‌కు ఘన నివాళి కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 12:14 PM

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోరాట దినంగా జరపాలి – పి.ఓ.డబ్ల్యూ కార్యదర్శి గోకినపల్లి సరోజిని

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోరాట దినంగా జరపాలి – పి.ఓ.డబ్ల్యూ కార్యదర్శి గోకినపల్లి సరోజిని

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోరాట దినంగా జరపాలి – పి.ఓ.డబ్ల్యూ కార్యదర్శి గోకినపల్లి సరోజిని
March 05, 2026 07:43 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళల ఉపాధిని దెబ్బతీసే వి.బి.జి రాంజీ పథకాన్ని వ్యతిరేకించండి

పిండిప్రోలు: నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మరింతగా పెరిగాయని ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ) పాలేరు డివిజన్ ప్రధాన కార్యదర్శి గోకినపల్లి సరోజిని అన్నారు.

పిండిప్రోలు గ్రామంలోని రాయల వెంకట్ నారాయణ భవన్‌లో డివిజన్ అధ్యక్షురాలు శీలం పూలక్క అధ్యక్షతన నిర్వహించిన మహిళల ముఖ్య జనరల్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించిందని విమర్శించారు. పారిశ్రామిక, అసంఘటిత, సంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, వేతనాల్లో వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు.

మహిళలపై అసమానత్వం, అణచివేత, వివక్ష, పురుషాధిపత్యం వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళల హక్కుల సాధన కోసం ముందుకు సాగడమే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క అసలు ఉద్దేశమని చెప్పారు.

1908 మార్చి 8న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళా కార్మికులు పనిగంటల తగ్గింపు, వేతనాల పెంపు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించుకున్న చరిత్ర ఉందన్నారు. అందుకే మార్చి 8ను పండుగలా కాకుండా మహిళల హక్కుల కోసం పోరాట దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బందెల లలిత, కుంబజడ భారతమ్మ, కే సత్యవతి, అయితేనా బోయిన సునీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News