మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం – వివాహ వార్షికోత్సవాన్ని సేవతో జరుపుకున్న దంపతులు
మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం – వివాహ వార్షికోత్సవాన్ని సేవతో జరుపుకున్న దంపతులు
Editor Desk
నల్గొండ పట్టణం: ప్రముఖ వైద్యుడు డా. మిట్టపల్లి జనార్ధన్, సువర్ణ దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. మంగళవారం వాసవి క్లబ్ కెసీజీఎఫ్ నల్గొండ, వాసవి క్లబ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో స్థానిక సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని మానసిక వికలాంగ విద్యార్థులకు అన్నదానం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి ఆనందంగా గడిపిన ఈ కార్యక్రమం హృద్యంగా సాగింది.
ఈ సందర్భంగా డా. జనార్ధన్ మాట్లాడుతూ, తమ వివాహ వార్షికోత్సవాన్ని విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సేవ చేయడంలోనే నిజమైన సంతోషం ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, సిబ్బంది వరలక్ష్మి, సల్మా, రాజు, రాజేంద్రప్రసాద్, వాసవి క్లబ్ సభ్యులు మిట్టపల్లి వాత్సవ్, సంతోషిని, మురారి శెట్టి శంకర్, నందిని తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి