ప్రజల ప్రాణాలను కాపాడుదాం
ఎల్బీనగర్
మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్బంగా శనివారం సరూర్ నగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి విక్టోరియా మెమోరియల్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ మలేరియా నిర్మూలన దిశగా ప్రయాణం చేయాలన్నారు. ఆ దిశగా ముందుకు సాగాలని కోరారు. మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈకార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి