Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 14, 2026 09:23 AM

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు
March 14, 2026 06:24 AM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు* మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సిద్ధమైంది. పరీక్షల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరీక్షల పవిత్రతను కాపాడేందుకు కమిషనరేట్ పరిధిలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని కఠినంగా నిషేధించారు. ఈ ఆంక్షలు మార్చి 14వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. అయితే విధుల్లో ఉన్న పోలీసులు, మిలిటరీ సిబ్బంది, హోమ్ గార్డులు, విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మరియు అంత్యక్రియల ఊరేగింపులకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది.


పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు.

నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News