Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:04 AM

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు
14-03-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు* మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సిద్ధమైంది. పరీక్షల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరీక్షల పవిత్రతను కాపాడేందుకు కమిషనరేట్ పరిధిలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని కఠినంగా నిషేధించారు. ఈ ఆంక్షలు మార్చి 14వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. అయితే విధుల్లో ఉన్న పోలీసులు, మిలిటరీ సిబ్బంది, హోమ్ గార్డులు, విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మరియు అంత్యక్రియల ఊరేగింపులకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది.


పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు.

నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Sthanikam

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు

Article Image

పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు* మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సిద్ధమైంది. పరీక్షల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరీక్షల పవిత్రతను కాపాడేందుకు కమిషనరేట్ పరిధిలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని కఠినంగా నిషేధించారు. ఈ ఆంక్షలు మార్చి 14వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. అయితే విధుల్లో ఉన్న పోలీసులు, మిలిటరీ సిబ్బంది, హోమ్ గార్డులు, విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మరియు అంత్యక్రియల ఊరేగింపులకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది.


పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు.

నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News