మాజీ ఉపసర్పంచ్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళులు
మాజీ ఉపసర్పంచ్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళులు
Editor Desk
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ దాసరి శ్రవణ్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం మృతుని నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రవణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, సర్పంచులు అంబటి ఉపేంద్రమ్మ, రవీందర్ రెడ్డి, గర్దాస్ విక్రమ్, పులిపలుపుల వీరస్వామి, మాజీ ఎంపీటీసీలు పున్న వెంకటేశం, ఎండి ఆమీర్, జిల్లా నాయకులు బద్దుల రమేష్, ఎస్.కె చాంద్, నాయకులు బత్తుల వెంకన్న, కోనూరు ముత్తయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాసరెడ్డి, తాళ్ల క్రాంతి కుమార్, చొప్పరి నరసింహ, బొడ్డుపల్లి రాజు, జాల అమరేందర్ రెడ్డి, ఆవుల శ్రీధర్, నల్ల సైదులు, ఎండి ఆరిఫ్, లక్ష్మయ్య, కృష్ణ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి