Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:17 AM

మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి ఘన సన్మానం ర్యాలీతో స్వాగతం.. చర్చి సంఘస్తుల అభినందనలు

మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి ఘన సన్మానం ర్యాలీతో స్వాగతం.. చర్చి సంఘస్తుల అభినందనలు

మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి ఘన సన్మానం ర్యాలీతో స్వాగతం.. చర్చి సంఘస్తుల అభినందనలు
March 09, 2026 03:57 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి: పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కండల ఉపేందర్ రెడ్డి కు కూసుమంచి మండల కేంద్రంలో ఆదివారం ఘన సన్మానం నిర్వహించారు. మండలంలోని సి.ఎస్‌.ఐ ఇమ్మానుయేల్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో చర్చి సంఘస్తులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పూలు చల్లుతూ ర్యాలీగా చర్చిలోకి తీసుకువెళ్లి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చర్చి అభివృద్ధికి అందించిన సహాయాన్ని గుర్తు చేశారు. చర్చి ఎక్స్టెన్షన్ బలిపీఠ నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళంగా అందించడంతో బలిపీఠ నిర్మాణం, టైల్స్ వేయడం, చర్చి పరిసరాలను అభివృద్ధి చేయడం సాధ్యమైందని తెలిపారు. అలాగే కూసుమంచి పాస్ట్రేట్ పరిధిలోని పాత కూసుమంచి చర్చి ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.90 వేలు, ఇమ్మానుయేల్ చర్చికి రూ.3 లక్షలు, గట్టు సింగారం చర్చికి రేకుల నిర్మాణానికి రూ.60 వేలు, ఉర్లుగొండ చర్చి ప్రహరీ నిర్మాణానికి రూ.30 వేలు, నాయకన్ గూడెం చర్చికి విద్యుత్ ఉపకరణాల కోసం రూ.20 వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తం రూ.5 లక్షలతో ఐదు చర్చిల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు తమవంతు సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే తనకు బాధ కలుగుతుందని, ఎవరికైనా సమస్య ఉంటే తన వద్దకు వచ్చినపుడు సాధ్యమైనంతవరకు సహాయం అందిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా పాలేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోదాడ గ్రూప్ చైర్మన్ రెవరెండ్ రమేష్, కూసుమంచి పాస్ట్రేట్ చైర్మన్ శ్రీనివాస్, భారత్ రాష్ట్ర సమితి మండల కమిటీ నాయకులు వేముల వీరయ్య, ఎండి ఆసీపాషా, ఇతర నాయకులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News