Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 10:30 PM

మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి.!

మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి.!

మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి.!
May 16, 2026 09:00 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


జాప్యం లేకుండా రోజూ 400 లారీలు దించేలా చూడాలి..

జిల్లాలో ఇప్పటివరకు 6.76 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు..

రైతులకు ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలి..

రైస్ మిల్లర్లు, అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం..

నల్గొండ : కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని రైస్ మిల్లులలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అన్లోడింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ఆయన పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లుల యాజమాన్యాలతో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియపై సుదీర్ఘంగా సమీక్షించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 6 లక్షల 76 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా మిల్లర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మిల్లుల్లో ప్రతిరోజూ కనీసం 400 లారీల ధాన్యాన్ని దించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

హమాలీల కొరత రానివ్వద్దు..

​అన్లోడింగ్ ప్రక్రియకు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని అవసరమైతే సుదూర ప్రాంతాల నుంచి కూడా వారిని రప్పించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయి ఖాళీగా ఉన్న ఐకేపీ కేంద్రాల హమాలీలను కూడా అన్లోడింగ్ పనులకు వినియోగించుకోవచ్చన్నారు. ధాన్యం దించిన వెంటనే ట్రక్ షీట్లను తీసుకెళ్లాలని, రైస్ మిల్లులు, లారీ ట్యాగింగ్ వంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే అధికారులు క్షేత్రస్థాయిలోనే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ధాన్యం రవాణా నిరంతరాయంగా సాగేందుకు మిర్యాలగూడ లారీ అసోసియేషన్ అదనంగా 50 లారీలను అందుబాటులో ఉంచాలని ప్రక్రియ పూర్తయ్యే వరకు సహకరించాలని కోరారు.

10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి కావాలి.. ఎస్పీ

లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా ముందస్తు వ్యూహంతో ముందుకు వెళ్లాలి. ధాన్యం రవాణా అన్లోడింగ్ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. మిగిలిన ధాన్యాన్ని రాబోయే 10 రోజుల్లో పూర్తిగా లిఫ్టింగ్ (సేకరణ) చేయాలి. మిల్లులకు ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందిస్తుంది. ప్రభుత్వ శాఖలు, మిల్లర్లు, లారీ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి సహకరించాలి.

ప్రభుత్వానికి మిల్లర్ల అసోసియేషన్ హామీ..

​ధాన్యం సేకరణ, అన్లోడింగ్ ప్రక్రియలో ప్రభుత్వానికి తాము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా అధికారులకు హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి (డీఎస్ఓ) వెంకటేష్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ (డీఎం) రాంపత్తి నాయక్, తహసిల్దార్ శ్రీనివాస్, మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు గౌరు శ్రీనివాస్, బాబి, నవీన్ శ్రీరామ్, పలువురు రైస్ మిల్లుల యజమానులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News