Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 08:14 PM

లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది.

లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది.

లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది.
May 16, 2026 07:22 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: పుస్తకాలను నిరంతరం చదవడం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని, ప్రపంచ చరిత్ర, సమాజ పరిణామాలను అర్థం చేసుకోవచ్చని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ, న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన “బుక్ టాక్” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా రాజ్‌మోహన్ గాంధీ రచించిన “డు యు నో యువర్ హిందూయిజం” పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ భారతదేశం లౌకిక దేశమని, అన్ని మతాలను పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన హిందూయిజం ఇతర మతాల ఆచారాలను కూడా గౌరవించాలని చెబుతోందని వివరించారు.

పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యులు ప్రొ. జి. హరగోపాల్ మాట్లాడుతూ టి.ఎం. కృష్ణ రచించిన “వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా: డీకోడింగ్ ఏ నేషన్ సింబల్స్” పుస్తకాన్ని ప్రస్తావించారు. దేశ చరిత్ర, రాజ్యాంగ విలువలను అర్థం చేసుకోవాలంటే విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమానికి వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. లైబ్రరీలు విద్యార్థుల పరిశోధన, విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో ప్రొ. జి. పుష్పా చక్రపాణి, డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, ప్రొ. రజని, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News