లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది.
లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది.
Editor Desk
హైదరాబాద్: పుస్తకాలను నిరంతరం చదవడం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని, ప్రపంచ చరిత్ర, సమాజ పరిణామాలను అర్థం చేసుకోవచ్చని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ, న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన “బుక్ టాక్” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజ్మోహన్ గాంధీ రచించిన “డు యు నో యువర్ హిందూయిజం” పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ భారతదేశం లౌకిక దేశమని, అన్ని మతాలను పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన హిందూయిజం ఇతర మతాల ఆచారాలను కూడా గౌరవించాలని చెబుతోందని వివరించారు.
పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యులు ప్రొ. జి. హరగోపాల్ మాట్లాడుతూ టి.ఎం. కృష్ణ రచించిన “వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా: డీకోడింగ్ ఏ నేషన్ సింబల్స్” పుస్తకాన్ని ప్రస్తావించారు. దేశ చరిత్ర, రాజ్యాంగ విలువలను అర్థం చేసుకోవాలంటే విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమానికి వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. లైబ్రరీలు విద్యార్థుల పరిశోధన, విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో ప్రొ. జి. పుష్పా చక్రపాణి, డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, ప్రొ. రజని, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి