ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్
ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్
Editor Desk
రామన్నపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద ఇంద్రపాలనగరం ప్రాథమిక పశువైద్యశాల వద్ద సమగ్ర పశుసంవర్ధక చికిత్స, అవగాహన శిబిరాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పశువుల సంరక్షణ, వ్యాధుల నివారణ, ఆధునిక పద్ధతులపై రైతులకు వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ జిట్టబోయిన వెంకటేష్, మాధం నగేష్, కంబాలపల్లి స్వామి పాల్గొన్నారు.
వైద్య సిబ్బందిలో ఏడి డాక్టర్ ఇందు, డాక్టర్ జోత్స్న, డాక్టర్ అన్వర్ అలీ, డాక్టర్ రామాంజనేయులు, రాజేందర్, శ్రీశైలం, మల్లేష్, సురేష్ సేవలందించారు. రైతులు కోలుకులపల్లి లింగయ్య, మిర్యాల భద్రయ్య, సింగణబోయిన శ్రీనివాస్, ఈర్లపల్లి కిష్టయ్య, శ్యామల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి