ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు
Editor Desk
హయత్నగర్,: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో “మీ ఆరోగ్యం.. మా ప్రాధాన్యత” అనే అంశంతో ఈ శిబిరాన్ని చేపట్టారు.
డా. కె. మల్లేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, షుగర్ పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు అందించారు.
కళాశాల ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ చైర్మన్ డా. పి. సురేష్బాబు మార్గదర్శకత్వంలో కార్యక్రమం జరిగింది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. ఇ. యాదగిరిరెడ్డి, డా. ఎస్. శారదాదేవి శిబిరాన్ని సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా వైద్య బృందం ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి వ్యాధులపై అవగాహన కల్పించింది. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. డి. మధు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, లైబ్రేరియన్ డా. ఏ. దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి