Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:11 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు
16-05-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్,: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో “మీ ఆరోగ్యం.. మా ప్రాధాన్యత” అనే అంశంతో ఈ శిబిరాన్ని చేపట్టారు.

డా. కె. మల్లేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, షుగర్ పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు అందించారు.

కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ డా. పి. సురేష్‌బాబు మార్గదర్శకత్వంలో కార్యక్రమం జరిగింది. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. ఇ. యాదగిరిరెడ్డి, డా. ఎస్. శారదాదేవి శిబిరాన్ని సమన్వయం చేశారు.

ఈ సందర్భంగా వైద్య బృందం ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి వ్యాధులపై అవగాహన కల్పించింది. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. డి. మధు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, లైబ్రేరియన్ డా. ఏ. దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు

Article Image

హయత్‌నగర్,: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో “మీ ఆరోగ్యం.. మా ప్రాధాన్యత” అనే అంశంతో ఈ శిబిరాన్ని చేపట్టారు.

డా. కె. మల్లేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, షుగర్ పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు అందించారు.

కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ డా. పి. సురేష్‌బాబు మార్గదర్శకత్వంలో కార్యక్రమం జరిగింది. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. ఇ. యాదగిరిరెడ్డి, డా. ఎస్. శారదాదేవి శిబిరాన్ని సమన్వయం చేశారు.

ఈ సందర్భంగా వైద్య బృందం ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి వ్యాధులపై అవగాహన కల్పించింది. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. డి. మధు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, లైబ్రేరియన్ డా. ఏ. దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News