Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:01 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు
May 16, 2026 06:09 PM 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్,: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో “మీ ఆరోగ్యం.. మా ప్రాధాన్యత” అనే అంశంతో ఈ శిబిరాన్ని చేపట్టారు.

డా. కె. మల్లేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, షుగర్ పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు అందించారు.

కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ డా. పి. సురేష్‌బాబు మార్గదర్శకత్వంలో కార్యక్రమం జరిగింది. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. ఇ. యాదగిరిరెడ్డి, డా. ఎస్. శారదాదేవి శిబిరాన్ని సమన్వయం చేశారు.

ఈ సందర్భంగా వైద్య బృందం ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి వ్యాధులపై అవగాహన కల్పించింది. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. డి. మధు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, లైబ్రేరియన్ డా. ఏ. దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News